ICC T20 World Cup Squad: ఫైనల్ లో దంచి కొట్టినా.. విరాట్ కోహ్లీకి దక్కని చోటు..

వాస్తవానికి గత రెండు సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడాడు. టోర్నీలలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందు ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 2, 2024 9:08 am

ICC T20 World Cup Squad

Follow us on

ICC T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లో విఫలమైన విరాట్ కోహ్లీ.. ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు.. సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్టే.. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. రోహిత్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ విఫలమైనప్పటికీ.. అక్షర్ పటేల్, శివం దూబే వంటి ఆటగాళ్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తద్వారా టీమిండియా భారీ స్కోరు చేసేందుకు బాటలు వేశాడు. ఒకానొక దశలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన టీం ఇండియా.. 20 ఓవర్లలో 176 పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్సే.. ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికా పై ఏడు పరుగులు తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఫైనల్ లో అద్భుతంగా ఆడిన నేపథ్యంలో అప్పటిదాకా కోహ్లీపై వినిపించిన విమర్శలు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఇదే సమయంలో అతడిపై అభినందనలు కురవడం మొదలయ్యాయి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విరాట్ కోహ్లీ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు..

ఆ స్థాయిలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఐసిసి టి20 ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించలేదు. అంతకుముందు మ్యాచ్ లలో విరాట్ విఫలం కావడంతోనే 12 మంది సభ్యుల జట్టుకు అతడిని ఎంపిక చేయలేదని ఐసిసి ప్రకటించింది. విరాట్ కు స్థానం లభించకపోయినప్పటికీ టీమ్ ఇండియా నుంచి జట్టులో ఆరుగురికి అవకాశం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు.. ఇక ఆఫ్గనిస్తాన్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు కూడా ఐసీసీ జట్టులో స్థానం దక్కింది.. ఐసీసీ ప్రకటించిన ప్రపంచ కప్ జట్టులో భారత్ నుంచి రోహిత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెహమాన్ ఉల్లా, గుర్బాజ్, రషీద్ ఖాన్, ఫారూఖీ ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి మార్కస్ స్టోయినిస్, వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికా నుంచి 12వ ఆటగాడిగా హెన్రిచ్ నోకియా ఎంపికయ్యారు..

వాస్తవానికి గత రెండు సీజన్లో విరాట్ అద్భుతంగా ఆడాడు. టోర్నీలలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందు ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు. కానీ కీలకమైన టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ లు మినహా.. మిగతా అన్నింటిలో విఫలమయ్యాడు. దీంతో కోహ్లీ ఆట తీరుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.. తనపై వస్తున్న విమర్శలకు ఫైనల్ మ్యాచ్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి.. దానిద్వారా సమాధానం చెప్పాడు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్లో హీరోగా నిలిచాడు. ఐసీసీ ఎంపిక చేసిన టీమ్ లో స్థానం దక్కించుకోకపోయినప్పటికీ.. విరాట్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆర్ధ సెంచరీ చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు.