మనిషి తిండి లేకుండా కొన్ని రోజులు ఉండగలడేమోకానీ.. నీళ్లు తాగకుండా ఉండడం అసాధ్యం. మానవ శరీరంలో నీటి పాత్ర అంత ముఖ్యమైనది. అయితే.. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్లు తాగే నీళ్లలో ప్యూరిటీ ఉండేలా చూసుకుంటారు. దేశంలో మెజారిటీ జనం మునిసిపల్ పంపు నీళ్లనే తాగుతారు. కొందరు మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగుతారు. ఇందులోనూ హిమాలయ, ఆల్కలిన్ వాటర్ అంటూ మరింత ఖరీదైన నీళ్లు తాగుతారు. మరి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శృతిహాసన్ ఏ నీళ్లు తాగుతారో మీకు తెలుసా?
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితా తీస్తే.. కోహ్లీ ముందు వరసలో ఉంటాడు. అతని ఆటలో టెక్నిక్ తోపాటు కీలక పాత్ర పోషించే మరో అంశం అతని ఫిట్ నెస్. కోహ్లీ ఫిట్ నెస్ చూసి చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లే అబ్బుర పడుతుంటారు. అటు శృతిహాసన్ కూడా ఎలాంటి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. చూపుతిప్పుకోనివ్వని అందాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోందీ బ్యూటీ.
అయితే.. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే వీళ్లు.. కేవలం జిమ్ లో వర్కవుట్స్ పర్ఫెక్ట్ గా చేయడం.. డైట్ ఫాలో కావడమే కాదు.. తాగే నీటిలోనూ క్వాలిటీ మెయింటెయిన్ చేస్తుంటారు. అవును.. కోహ్లీ, శృతిహాసన్ అందరూ తాగే రెగ్యులర్ వాటర్ తీసుకోరు. సాధారణ మినరల్ వాటర్ కూడా తాగరు. వీరు ప్రత్యేకంగా బ్లాక్ వాటర్ తీసుకుంటారు.
దీనిలో ప్రత్యేకతలు ఒకటీ రెండు కాదు.. చాలానే ఉన్నాయి. బ్లాక్ వాటర్ లో 70 మినరల్స్ ఉంటాయట. ఇందులో ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణ క్రియను సజావుగా సాగేలా చూస్తాయట. అదేవిధంగా.. అసిడిటీ లాంటివి దరిచేరకుండా చూస్తాయి. ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు.. దేహం నిత్యనూతనంగా మెరిసిపోయే అవకాశం కూడా ఉంటుందట. అందుకే.. సెలబ్రిటీలు ఈ నీటినే ఎక్కువగా తాగుతున్నారు. విరాట్ కోహ్లీ, శృతిహాసన్ తోపాటు మలైకా అరోరా కూడా ఈ బ్లాక్ వాటరే తాగుతోంది. ఈ వాటర్ ధర్ లీటరుకు 100 రూపాయల వరకూ ఉంటుంది.