spot_img
Homeక్రీడలుక్రికెట్‌Dulip trophy 2024 : దులీప్ ట్రోఫీ నుంచి సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా...

Dulip trophy 2024 : దులీప్ ట్రోఫీ నుంచి సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా ఔట్.. కారణం ఇదే..

Dulip trophy 2024 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గెలవాలంటే టీమిండియా కచ్చితంగా ఐసీసీ టెస్ట్ క్రికెట్ లో పాయింట్ల మొదటి రెండు స్థానాల్లో ఉండాలి. అలా జరగాలంటే ఎదురయ్యే ప్రతి టెస్ట్ సిరీస్ లో భారత్ గెలవాలి. వచ్చే నెలలో టీమిండియా బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తో తలపడుతుంది. ఈ సిరీస్ లో ఏకంగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు భారత్ ఆడుతుంది.. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ ఆడే జట్టును బలోపేతం చేసేందుకు బీసీసీఐ అనే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి దేశవాళి క్రికెట్ టోర్నీని తీసుకొచ్చింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మినహా మిగతా వారందరూ ఆడాలని షరతు విధించింది. త్వరలో ప్రారంభమయ్యే దేశవాళీ దులీప్ ట్రోఫీలో అందరూ ఆడాలని స్పష్టం చేసింది. గతానికంటే భిన్నంగా ఈసారి ఏకంగా నాలుగు జట్లను ఎంపిక చేసింది. ఆ నాలుగు జట్లకు జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లను కెప్టెన్లుగా నియమించింది. ఈ ట్రోఫీలో ప్రతిభ చూపిన ఆటగాళ్లకే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ జట్లను గతంలోనే నియమించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరులో దులీప్ ట్రోఫీని నిర్వహించనుంది.

తప్పుకున్న కీలక ఆటగాళ్లు

ఈ టోర్నీ ప్రారంభానికి ముందే సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా తప్పుకున్నారు. నవదీప్ షైనీ, గౌరవ్ యాదవ్ అనే ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కొంతకాలంగా గౌరవ్ ఆడుతున్నాడు. గత రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, మాలిక్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ లో వారికి ఆడే అవకాశం ఉండదు. తదుపరి రౌండులో వారు తమ జట్లలోకి ఎంట్రీ ఇస్తారు. వచ్చే నెలలో దులీప్ ప్రొసీడ్ మొదలవుతుంది. గతంలో జోనల్ విధానంలో దులీప్ ట్రోఫీ నిర్వహించారు. ఈసారి ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి అనే పేరుతో జట్లను ఏర్పాటు చేశారు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని క్రికెట్ గ్రౌండ్ కాంప్లెక్స్ లో రెండు వేదికలలో దులీప్ ట్రోఫీ సాగుతుంది. బెంగళూరులోనూ కొన్ని మ్యాచులు నిర్వహిస్తారు.. సెప్టెంబర్ ఐదున ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.. సెప్టెంబర్ ఐదు నుంచి 8 దాకా ఇండియా ఏ, ఇండియా బి జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడతాయి. సెప్టెంబర్ ఐదు నుంచి 8 దాకా ఇండియా – సి, ఇండియా – డీ జట్టు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో పోటీ పడతాయి. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు ఇండియా ఏ, ఇండియా డీ జట్లు అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో పరస్పరం పోటీ పడతాయి. సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు ఇండియా బి, ఇండియా సీ జట్లు అనంతపురంలో తలపడతాయి. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఇండియా ఏ, ఇండియా సీ జట్లు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో తలపడతాయి. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు ఇండియా బీ, ఇండియా డీ జట్లు అనంతపురం మైదానంలో పోటీ పడతాయి. ఇండియా ఏ జట్టుకు గిల్, బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్, సీ జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్, డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లు గా వ్యవహరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version