spot_img
Homeక్రీడలుక్రికెట్‌IND vs ENG: వారిద్దరి పై వేటు.. వీరిద్దరికి చోటు.. ఇంగ్లాండ్ తో మూడో వన్డే...

IND vs ENG: వారిద్దరి పై వేటు.. వీరిద్దరికి చోటు.. ఇంగ్లాండ్ తో మూడో వన్డే ఆడే టీమ్ ఇండియా ఇదే..

IND vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో కేఎల్ రాహుల్(KL Rahul), హర్షిత్ రాణా(Harshit Rana) కూడా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ తన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేదు. మరోవైపు హర్షిత్ రాణా కూడా అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ చేయలేదు. దీంతో వారిద్దరినీ అహ్మదాబాద్ వన్డే నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. వారి స్థానంలో రిషబ్ పంత్(Rishabh pant), అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) ను తీసుకున్నట్టు సమాచారం. రిషబ్ పంత్ గత శ్రీలంక సిరీస్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయినప్పటికీ .. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో మాత్రం అప్పుడప్పుడు మెరుపులు మెరిపించాడు. రిషబ్ పంత్ కంటే కే ఎల్ రాహుల్ మెరుగని వన్డే సిరీస్లో అతనికి అవకాశం కల్పించారు. కానీ కేఎల్ రాహుల్ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో మూడో వన్డే కు పక్కన పెట్టారు. ఒకవేళ రిషబ్ పంత్ కనుక అహ్మదాబాద్ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేస్తే చాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ కంటే అతడినే జట్టులోకి తీసుకునే అవకాశాలుంటాయి. మరోవైపు హర్షిత్ రాణా కూడా ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో అతడిని పక్కన పెట్టారు. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకున్నారు. ఒకవేళ అతడు కనక అహ్మదాబాద్ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో తుది జట్టులో చోటు లభిస్తుంది.

ఈ వన్డే లో పరిశీలించే అవకాశం

ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 2 వన్డేలలో భారత్ గెలిచినప్పటికీ.. కొందరి ఆటగాళ్ల ప్రదర్శన జట్టు మేనేజ్మెంట్ అనుకున్న స్థాయిలో లేదట. అందువల్లే ఈ మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందట. మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు తుది జట్టులో స్థానం కల్పిస్తారట. 2017లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఆ తప్పిదానికి చోటు ఇవ్వకుండా టీం ఇండియా కప్ గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. బుమ్రా లాంటి ఆటగాడు గాయం వల్ల మెగా టోర్నికి దూరం కావడం టీమిడియాకు కాస్త ఇబ్బందే అయినప్పటికీ.. ఉన్నవాళ్లతోనే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని.. కప్ విజేతగా నిలవాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆటగాళ్ల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఐతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు తిరుగుండదు. ఐతే వచ్చిన అవకాశాలను ఆటగాళ్లు ఏ స్థాయిలో వినియోగించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. ” చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే మేనేజ్మెంట్ కూడా అనేక రకాల కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో వన్డే నామమాత్రమే అయినప్పటికీ.. సెలక్షన్ కమిటీ ఈ మ్యాచ్ ను కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. ఆటగాళ్ల ఎంపిక నుంచి మొదలు పెడితే తుది జట్టు వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. దీనిని బట్టి టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version