Tilak Varma Captaincy: గెలవలసిన మ్యాచ్ అది.. భారీ అంతరంతో విజయం సాధించాల్సిన మ్యాచ్ అది.. విపరీతమైన ఒత్తిడి ఉంది. దీనికి తోడు విమర్శలు.. ఇవన్నీ కూడా అతనిలో పట్టుదల పెంచాయి. పైగా భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు తనలో ఉన్న నైపుణ్యాన్ని.. నాయకత్వాన్ని బయటకి తీశాడు. ఫలితంగా అభిమానులు అంచనావేసిన ఫలితాన్ని అందించి.. అదరగొట్టాడు..
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిచి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగుల తేడాతో విజయం సాధించి.. ముక్కోణపు సిరీస్ లో ఫైనల్ వెళ్ళింది. శ్రీలంకతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది. ఈ మ్యాచ్లో ముందుగా టీమిడియా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య 58, సూర్య వంశీ 38, గైక్వాడ్ 30, వి ప్రజ్ 30, కుమార్ కుషాగ్రా 58 పరుగులతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ తిలక్ వర్మ 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు వర్మ స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు తీశాడు. సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లలేదు. కెప్టెన్ అంటే ఎలా ఆడాలో అలానే ఆడి చూపించాడు. కుమార్ కుశాగ్రతో కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 104 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం టీమిండియా కు ఆయువు పట్టు లాగా నిలిచింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్ల జోరుకు కళ్లెం వేసింది.. అందువల్ల టీం ఇండియా ఏకంగా 319 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టును కేవలం 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆల్ అవుట్ చేసింది టీం ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో బహిర్ షా 57, ఫైజల్ 46, ఇమ్రాన్ 32 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు నిలబడకపోవడంతో ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. టీమిండియాలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీమి డే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. యష్ ఠాకూర్ 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అన్సుల్ కాంబోజి, విప్రజ్, సూర్యాంష్, అనుకూల్ రాయ్ తలా ఒక వికెట్ తీశారు. తెలుగోడు తిలక్ వర్మ బ్యాటింగ్లో.. నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ట్రోఫీకి ఒక అడుగు దూరంలో నిలిచింది. శ్రీలంక జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. తిలక్ వర్మ ఆటగాడిగా మరో మెట్టు ఎక్కినట్టే.
