IND vs AUS : స్టార్క్ దెబ్బకు ఇద్దరు డక్; భారత్ విలవిల: 64/5

IND vs AUS :  మొదటి వన్డే చచ్చి చెడి గెలిచింది..ఇక రెండో వన్డేలో అయినా జాగ్రత్తగా ఆడుతుంది అనుకుంటే.. మొదటి వన్డేనే అనుసరిస్తోంది.. ఆదివారం విశాఖపట్నంలో ప్రారంభమైన రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ భారత బ్యాటర్లను వణికిస్తున్నాడు. 10 ఓవర్లు కూడా పూర్తిగా ముందే సగం టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరుకుందంటే అతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి […]

Written By: Bhaskar, Updated On : March 19, 2023 4:13 pm
Follow us on

IND vs AUS :  మొదటి వన్డే చచ్చి చెడి గెలిచింది..ఇక రెండో వన్డేలో అయినా జాగ్రత్తగా ఆడుతుంది అనుకుంటే.. మొదటి వన్డేనే అనుసరిస్తోంది.. ఆదివారం విశాఖపట్నంలో ప్రారంభమైన రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ భారత బ్యాటర్లను వణికిస్తున్నాడు. 10 ఓవర్లు కూడా పూర్తిగా ముందే సగం టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరుకుందంటే అతడి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొదటి వన్డేలో భారత బ్యాటర్లను వణికించిన స్టార్క్.. ఈ మ్యాచ్ లోనూ అదే బౌలింగ్ కొనసాగించాడు.. మూడు పరుగుల వద్ద గిల్ ను ఎల్ బీ డబ్ల్యు గా ఔట్ చేసిన స్టార్క్.. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన రేపాడు.. ఇక అబాట్ కూడా హార్దిక్ పాండ్యా అవుట్ చేసి భారత జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు.

మైదానం మీద 241 పరుగులు అత్యధిక స్కోరు. కానీ భారత బ్యాట్స్మెన్ ఆట తీరు చూస్తుంటే అది కూడా కొట్టేలా లేరు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పేవిలియన్ చేరుతున్నారు. మొదటి వన్డేలో 0 పరుగులకే వెనుదిరిగిన సూర్య కుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ లోనూ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. మ్యాచ్లో ఆఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్ 9 పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్లో ఎల్ బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. ఓపెనర్ గా విఫలమవుతున్న అతడు..మిడిల్ ఆర్డర్లో కుదురుకున్నాడు అంటే.. దానిని మొదటి వన్డే వరకే పరిమితం చేశాడు.

అంతకుముందు రోజు వర్షం కురవడంతో మైదానం మీద తేమ ఉంది. దీంతో గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగేలా బంతులు వేస్తున్నారు. ఈ కథనం రాసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.. విరాట్ కోహ్లీ 28, జడేజా 8 పరుగులతో క్రీజు లో ఉన్నారు.