spot_img
Homeక్రీడలుT20 World Cup 2024: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. కొత్త ఆటగాడికి అవకాశం..

T20 World Cup 2024: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. కొత్త ఆటగాడికి అవకాశం..

T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన పొరపాటున పునరావృతం కాకుండా చూడాలని టీమిండియా భావిస్తోంది.. టెస్ట్, వన్డే, టీ- 20 ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ.. 2011 తర్వాత ఇంతవరకు ఐసీసీ నిర్వహించిన ఏ మెగా టోర్నీని కూడా టీమిండియా దక్కించుకోలేకపోతోంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. పెద్ద పెద్ద బ్యాటర్లు ఉన్నప్పటికీ ఒత్తిడిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ లో ఆ తప్పును పునరావృతం చేయొద్దని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే టీ – 20 వరల్డ్ కప్ కు సంబంధించి బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీమిండియా త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. బ్యాటింగ్ ద్యయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ని ఓపెనర్లుగా పంపేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఐపీఎల్లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తేనే హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఆ సంకేతాలను అతనికి బీసీసీఐ సెలెక్టర్లు పంపినట్టు తెలుస్తోంది. అంతేకాదు గత వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బ్యాటర్ గా వెళ్లిన గిల్ ను ఈసారి బ్యాక్అప్ ఓపెనర్ గా ఉంటాడని సమాచారం. రాజస్థాన్ జట్టులో ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్న రియాన్ పరాగ్ ను టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రాకు తోడుగా మయాంక్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగం లోనూ సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ వంటి సీనియర్లనే కాకుండా ఐపీఎల్లో సత్తాచాటుతున్న యువకులకు కూడా ఈ సిరీస్ లో బీసీసీఐ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మాయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు ఐపీఎల్లో అదరగొడుతున్నారు. అయితే వీరిలో ఎవరికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper