SRH Vs Gujarat Titans: గుజరాత్ జట్టుతో మ్యాచ్.. కచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుంది.. ఇది సాధారణ విశ్లేషకుడి మాట కాదు. గూగుల్ ప్రిడిక్షన్ కూడా. కానీ వాస్తవంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. గుజరాత్ బౌలింగ్ ముందు తట్టుకోలేక తడబడి పోయింది. దూసుకు వస్తున్న బంతులను తట్టుకోలేక పెద్దపెద్ద బ్యాటర్ల సైతం తలవంచారు. పరుగులు తీయడం కాదు కదా.. కనీసం వికెట్ కాపాడుకుంటే చాలు దేవుడా అనే స్థాయిలో ఉండిపోయారు. కానీ గుజరాత్ బౌలర్లు పదేపదే మ్యాజిక్ చేయడంతో హైదరాబాద్ బ్యాటర్ల పప్పులు ఉడకలేదు.
ఈ మ్యాచ్లో గుజరాత్ 168 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరూ ఆడుతున్న తీరు చూసి అప్పటికే హైదరాబాద్ ప్లేయర్లు పిచ్ గురించి ఒక అంచనా వేసుకొని ఉంటే బాగుండేది. కానీ, పిచ్ ను సులభంగా తీసుకున్నారు. పరుగులు ఈజీగా తీయవచ్చు అని భావించారు. కానీ వాస్తవంలో పరిస్థితి మరో విధంగా ఉండడంతో హైదరాబాద్ ఆటగాళ్లకు పరాభవం తప్పలేదు.
ఈ మ్యాచ్లో గుజరాత్ 168 పరుగులు చేస్తే.. హైదరాబాద్ జట్టు కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే చాప చుట్టేసింది.. ప్రమాదకరమైన హెడ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఆరు పరుగులు మాత్రమే చేశాడు. కిషన్ 11 పరుగులు చేసి పెవిలియన్ వెళ్ళాడు. స్మరణ్ 9 పరుగులు, క్లాసెన్ 14 పరుగులు, సలీల్ అరోరా 16 పరుగులు చేశారు. నితీష్ కుమార్ రెడ్డి రెండు పరుగులకే అవుట్ అయ్యాడు..
ఈ ఓటమి ద్వారా హైదరాబాద్ జట్టు అనేక చత్త రికార్డులను నమోదు చేసుకుంది. 86 పరుగులకే ఆల్ అవుట్ అయి ఐపీఎల్లో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసింది. 2019లో ముంబై ఇండియన్స్ జట్టు మీద 96 పరుగులకు ఆల్ అవుట్ అయిన హైదరాబాద్ జట్టు.. తన పేరు మీద ఉన్న చెత్త రికార్డును తన బీట్ చేసింది. పరుగుల పరంగా కూడా అతిపెద్ద ఓటమిని హైదరాబాద్ జట్టు నమోదు చేసుకుంది. 2025లో కోల్ కతా జట్టు చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్.. తాజా మ్యాచ్లో 82 పరుగులు తేడాతో కూటమిపాలైంది. గుజరాత్ జట్టుతో జరిగిన గత ఏడు మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు వరుసగా 6 మ్యాచులలో ఓడిపోయింది.
ప్లాట్ పిచ్ ల మీద మాత్రమే హైదరాబాద్ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తారని విమర్శలు ఉన్నాయి. వాటిని హైదరాబాద్ ప్లేయర్లు మరోసారి నిజం చేశారు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ మీద సరిగా ఆడలేకపోయారు. కనీసం బంతిని డిపెండ్ కూడా చేసుకోలేకపోయారు. ఏ మాత్రం సత్తా చూపించలేకపోయారు. ఫలితంగా హైదరాబాద్ తన ఐపిఎల్ చరిత్రలోనే దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇలా తరబడిన ఆటగాళ్లు ఐపీఎల్ ట్రోఫీ ఎలా సాధిస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాగైతే కష్టమేనని.. ఇప్పటికైనా ప్లేయర్లు తమ ధోరణి మార్చుకోవాలని అభిమానులు పలుకుతున్నారు.