Shreyas Iyer : సూర్య కుమార్ యాదవ్ సారధిగా పరవాలేదు. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. అందువల్లే అతని స్థానంలో అయ్యర్ కు చోటు లభించింది. సారధిగా ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం లేదు. ఎందుకంటే సారధి మార్పు టీమ్ ఇండియాకు ప్రతిబంధకంగా మారింది. ఐర్లాండ్ సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ జట్టుతోనూ రెండో మ్యాచ్ లో ఓటమి.. వంటి పరిణామాలు టీమిండియాను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.. ముఖ్యంగా టీమ్ ఇండియా సారధి శ్రేయస్ అయ్యర్ కు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి.
నిజానికి టీమిండియా సొంత దేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ట్రోఫీ గెలిచింది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది. కానీ ఆ నామక జట్టు చేతిలో రెండు మ్యాచ్లు ఓడిపోయి పరువు తీసుకుంది. ఈ ఓటమి పరంపర ఇక్కడితో ఆగిపోలేదు.
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో టీం ఇండియా గెలవాల్సిన చోట ఓడిపోయింది. దాదాపు 16 ఓవర్ల వరకు ఆట మీద పట్టు సాగించిన టీమిండియా.. 17 ఓవర్లో పట్టు విడిచింది. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం చేయి జారిపోయింది.
ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. ఇంగ్లాండ్లో తొలి మ్యాచ్ ఓడిపోవడంతో.. రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా ఇలా ఇబ్బంది పడేందుకు ప్రధాన కారణం జట్టు కూర్పు అని సీనియర్ ప్లేయర్లు ఆరోపిస్తున్నారు. రోహిత్ నాయకత్వంలో.. సూర్య నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. కానీ వారి వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా లేదు.. కానీ అయ్యర్ పరిస్థితి అలా లేదు. ఆటగాడిగా అతడు ఐర్లాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్లో రెండో మ్యాచ్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టును ఏకతాటిమీద నిలిపి.. ఆడించడంలో విఫలమవుతున్నాడు.
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న వారంతా యంగ్ ప్లేయర్లే. ఐపీఎల్ లో వీరు సత్తా చూపించారు. కానీ ఇంటర్నేషనల్ లో మాత్రం ఆడలేక పోతున్నారు. అభిషేక్ శర్మ మిగతా వారంతా నీలకడలేని ఆడతీరుతో విమర్శల పాలవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ లో మందకోడి పిచ్ ల మీద ఆడలేక పోయారు. ఇంగ్లాండులో బాండ్స్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్లో కిషన్ వేగంగా పరుగులు చేయలేదు. చివర్లో తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు కాబట్టి ఆ స్కోర్ లభించింది.
ఇక బౌలింగ్లో రవి ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి పరువు తీశాడు. ఒక రకంగా మ్యాచ్ ఓడిపోవడానికి అతడే కారణమయ్యాడు . డెత్ ఓవర్లలో రవికి బంతి ఇవ్వడం శ్రేయస్ చేసిన అతి పెద్ద తప్పు. ఐపీఎల్ లో అయ్యర్ పంజాబ్ జట్టు లో పరిమిత వనరులతోనే అదరగొట్టాడు. కానీ ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం ఉన్న వనరులను వినియోగించుకోలేకపోతున్నాడు.. తిలక్ .. శివం దుబే వంటి వారు ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో శ్రేయస్సు వారిని వినియోగించుకోలేకపోతున్నాడు.. జట్టు సారధిగా సూర్య ఉన్నప్పుడు.. ఎవరైనా ప్రధాన బౌలర్ ఇబ్బంది పడుతుంటే వెంటనే తాత్కాలిక బౌలర్లను రంగంలోకి దింపేవాడు. ఫలితాన్ని జట్టుకు అనుకూలంగా మార్చేవాడు. అయ్యర్ అటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఐపీఎల్ లో అయ్యర్ తన స్థాయి ఏమిటో చూపించాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వచ్చే సరికి ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవానికి ఒక మ్యాచ్ గెలవడంలో సారథికి పూర్తి బాధ్యత ఉంటుంది. ఓడిపోయే విషయంలో కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే చేస్తారు. సారధి అందరి ఆటగళ్ల ప్రదర్శన అంచనా వేసి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ టీమిండియా సొంతం చేసుకోవాలంటే తదుపరి మూడు మ్యాచ్లు గెలవాలి. అది జరగాలంటే ఆటగాళ్లు నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి.. తమ పూర్తిస్థాయి ఆట తీరు ప్రదర్శించాలి.
