Homeక్రీడలుక్రికెట్‌IPL 2024, RR vs MI: రాజస్థాన్ పై ఓటమి.. ముంబై ప్లేఆఫ్ మరింత టఫ్.....

IPL 2024, RR vs MI: రాజస్థాన్ పై ఓటమి.. ముంబై ప్లేఆఫ్ మరింత టఫ్.. ఏం చేయాలంటే?

IPL 2024, RR vs MI: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ఈ సామెత అచ్చు గుద్దినట్టు ముంబై ఇండియన్స్ జట్టుకు సరిపోతుంది. పేరుకు గొప్ప గొప్ప ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అద్భుతమైన బౌలర్లు, సూపర్ పవర్ బ్యాటర్లు ప్లే -11 లో ఉన్నారు. అయినప్పటికీ ఏం ఉపయోగం? కీలక సమయంలో అవుట్ కావడం, జట్టుకు అవసరమైన సమయంలో చేతులెత్తేయడం.. పరిపాటిగా మారింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 17వ సీజన్లో అడుగు పెట్టిన ఆ జట్టు.. దారుణమైన ఆట తీరుతో పరువు పోగొట్టుకుంటున్నది. అనామక జట్టు లాగా ఆడుతోంది.. పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉంది. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ముంబై ఓడిపోయింది. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దరిద్రమైన బ్యాటింగ్, చండాలమైన ఫీల్డింగ్, అంతకంటే నాసిరకమైన బౌలింగ్ తో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ పై ఓటమిపాలైంది.

వాస్తవంగా ఈ మ్యాచ్లో కచ్చితంగా ముంబై గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రాజస్థాన్ పై ముంబై గత ట్రాక్ రికార్డు కూడా అదే చెబుతోంది. కానీ, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 రన్స్ చేసింది. తిలక్ వర్మ 65 పరుగులతో రాణించాడు. యువ ఆటగాడు నేహళ్ వదెరా 24 బంతుల్లో 49 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టి ముంబై జట్టు టాప్ ఆర్డర్ ను తునాతునకలు చేశాడు. అతని బౌలింగ్లో ముంబై కి వెన్నెముక లాంటి ఆటగాళ్లు పెవిలియన్ చేరుకున్నారు. సందీప్ శర్మ ఐదు వికెట్లు పడగొడితే ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. అశ్విన్, చాహల్ చెరో వికెట్ సాధించారు. చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 183 రన్స్ చేసి.. సులువైన విజయాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ బ్యాటర్ జైస్వాల్ 60 బంతుల్లో 104*, బట్లర్ 25 బంతుల్లో 35, సంజు 28 బంతుల్లో 38* రన్స్ చేసి రాజస్థాన్ జట్టును గెలిపించారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా మాత్రమే ఒక వికెట్ దక్కించుకున్నాడు.

సంక్లిష్టం

ఈ టోర్నీలో ఇప్పటివరకు ముంబై జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. మూడంటే మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. ముంబై జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ సీజన్లో ముంబై ఇంకా 6 మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్ చేయాలంటే ఈ ఆరింటికి ఆరు మ్యాచ్ లు ముంబై జట్టు గెలవాల్సిందే. ఒకవేళ ఏదైనా ఒక మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు రన్ రేట్ అత్యంత కీలకం అవుతుంది. ప్రస్తుతం ముంబై జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ఆరు మ్యాచులు గెలవడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. సంచలన ఆటతీరు ప్రదర్శిస్తే తప్ప ఆ జట్టు గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక ముంబై జట్టు తన తదుపరి మ్యాచులు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, కోల్ కతా, హైదరాబాద్, లక్నో జట్లతో ఆడాల్సి ఉంది. అయితే ఇందులో మూడు మ్యాచ్లు ముంబై జట్టు సొంత మైదానమైన వాంఖడే లో జరగనున్నాయి. అదొక్కటే ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version