India vs England T20: పనిగల్లోడికి పెత్తనమిస్తే నడి ఇంట్లోకి వచ్చి ఏదో చూపించాడట. ఇప్పుడు ఈ సామెత ఆటగాడికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది.. పైగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. టీమిండియా పతనాన్ని అతడు శాసించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత.. ఇంకెప్పుడు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకూడదని.. ఒకవేళ అవకాశం ఇచ్చిన సరే అతడికి ఆడే ఆపర్చునిటీ ఇవ్వకూడదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి నిన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద భారత్ గెలవాల్సిందే. ఎందుకంటే ప్రారంభం నుంచి 17వ ఓవర్ వరకు టీమిండియా మ్యాచ్ మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించింది. గెలిచే అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంది. దీనికి ప్రధాన కారణం ఆ బౌలర్. అతడు వేసిన ఓవర్. ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. బెతల్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు గెలుపు మీద పెద్దగా ఆశలు లేవు. ఈ దశలో కెప్టెన్ అయ్యర్ రవి బిష్ణోయ్ కి బంతి చేతికి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని సంపాదించాల్సిన అతడు అత్యంత నిర్లక్ష్యంగా బౌలింగ్ వేశాడు.
రవి బౌలింగ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 29 పరుగులు సాధించింది. ఇందులో రెండు నో బాల్స్ ఉన్నాయి.. ఈ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు వీరవిహారం చేయడం తో ఒత్తిడి పూర్తిగా తగ్గింది. మరొక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని సాధించింది.. 17 ఓవర్ లోనే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ఇంగ్లాండ్ ఓటమి అంచులో ఉంటే.. భారత జట్టు బౌలర్ రవి బిష్ణోయ్ చేతులారా ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఒక్కసారిగా నిరాశ పడిపోయారు… ఇటీవల ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు చేతిలో మ్యాచ్ ఓడిపోవడం.. ఇవన్నీ చూస్తుంటే టీమిండియా కు గ్రహచారం బాగోలేదు అన్నట్టుగా ఉంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఇలా ఒత్తిడి ఎదుర్కోవడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.
కేవలం ఐపిఎల్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉండగా.. కేవలం రవి బిష్ణోయ్ కి అవకాశం ఎందుకు ఇచ్చారని గౌతమ్ గంభీర్ ను సోషల్ మీడియా వేదికగా టీం ఇండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పనికిమాలిన బౌలర్ కు అవకాశం ఇస్తే ఫలితం ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జట్టుకూర్పులో గౌతమ్ గంభీర్ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

