Homeక్రీడలుక్రికెట్‌PM Modi: 8న విశాఖకు ప్రధాని.. స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన!

PM Modi: 8న విశాఖకు ప్రధాని.. స్టీల్ ప్లాంట్ పై కీలక ప్రకటన!

PM Modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈనెల 8న విశాఖకు రానున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. క్యాబినెట్ భేటీలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు. దాదాపు లక్ష కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. అయితే ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక ప్రకటన చేస్తారని ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ కేంద్రం మాత్రం దూకుడు మీద ఉంది. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. అందుకే విశాఖ వస్తున్న ప్రధాని మోదీ దీనిపై స్పష్టత ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

* సరికొత్త ప్రతిపాదన
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సరికొత్త ప్రతిపాదన చేసినట్లు సమాచారం. 17వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ప్లాంట్ కు నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నిసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముడి పదార్థాలను సమకూర్చుకోవడం కూడా సమస్యగా మారుతోంది. దీంతో రెండు బ్లాస్ట్ ఫర్నిసులనే వినియోగిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ఏర్పాటుకు నిధులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

* అది ప్రైవేటీకరణ అంటున్న కార్మిక వర్గాలు
అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ ప్రతిపాదనతోనే ప్రైవేటీకరణ ఎంట్రీకి నిర్ణయించారని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ కొత్తగా ప్రతిపాదనల వెనుక పోస్కో కంపెనీ పేరు వినిపిస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కు తో జాయింట్ వెంచర్ కోసం ప్లాంట్ లో 1500 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదన చేసింది. అత్యాధునికంగా స్టీల్ ఉత్పత్తి చేసి లాభాల్లో వాటా ఇస్తామని ఆఫర్ చేసింది. కానీ అప్పట్లో కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని నిరసనకు దిగాయి. దీంతో ఈ ఆలోచన అమలు కాలేదు. అయితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పెంచాలని కేంద్రం భావిస్తోంది. కానీ అది ప్రైవేటీకరణలో భాగమేనని కార్మిక వర్గాలు అనుమానిస్తున్నాయి. దాని బదులు ఆర్థికంగా సాయం అందించాలని కోరుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖకు ప్రధాని వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక స్పష్టత రానుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version