Homeక్రీడలుParalympics 2024: 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం.. నడుము భాగం చచ్చుబడిపోయింది.. సీన్ కట్...

Paralympics 2024: 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం.. నడుము భాగం చచ్చుబడిపోయింది.. సీన్ కట్ చేస్తే పారా ఒలింపిక్ విన్నర్

Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో స్టార్ షూటర్ అవని సంచలనాలు సృష్టించింది. అంచనాలకు మించి రాణించింది. టోక్యోలో స్వర్ణం సాధించి.. పారిస్ లో దానిని పునరావృతం చేసింది. 11 సంవత్సరాల వయసులో అవని కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె నడుము కింది భాగం వరకు చచ్చు పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అనేక ఆసుపత్రులలో తిప్పించి చికిత్స అందించారు. అనేక చికిత్సల తర్వాత ఆమె కోలుకుంది. ఆ తర్వాత రెండు పారా ఒలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇలా ఆమె బంగారు పతకాలు సాధించి అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రత్యేకగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభకు నిదర్శనంగా నిలబడింది.. అవని నవీ ముంబైలోని లక్ష్య షూటింగ్ క్లబ్ వ్యవస్థాపకురాలు సుమా షిరూర్ నేతృత్వంలో శిక్షణ పొందింది. ఒలింపిక్ మెడల్ సాధించేదాకా తనను తాను ఆవిష్కరించుకుంది. సుమ దగ్గర 2018 నుంచి అవని శిక్షణ పొందుతోంది. సుమ ఒలింపిక్స్ ఫైనలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా. 2018 నుంచి అవని ప్రతి ఏడాది నాలుగు సార్లు లక్ష్య షూటింగ్ క్లబ్ కు వచ్చి శిక్షణ పొందుతోంది. ఇలా శిక్షణ పొంది టోక్యో పారా ఒలింపిక్స్ లో మహిళల ప్రతి మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం దక్కించుకుంది. ఇలా పారా ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ దక్కించుకున్న తొలి భారత మహిళా పారా అథ్లెట్ గా సరికొత్త రికార్డు సృష్టించింది..

టోక్యో ఒలింపిక్స్ అనంతరం..

టోక్యో ఒలింపిక్స్ అనంతరం జరిగిన పారా షూటింగ్ వరల్డ్ కప్ లోనూ అవని స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఫలితంగా పారా షూటింగ్ భవిష్యత్తు అంతర్జాతీయ స్టార్ గా అవతరించింది. అంతేకాదు పద్మశ్రీ, ఖేల్ రత్న, యంగ్ ఇండియన్ షూటర్, పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను అవని దక్కించుకుంది. ఆమె సాధించిన విజయాలను గుర్తించిన రాజస్థాన్ ప్రభుత్వం అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ గా నియమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భేటీ బచావ్.. భేటీ పడావో కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. మరోవైపు అవని పారిస్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారుల ప్రదర్శన పట్ల భారత జాతి మొత్తం గర్వపడుతోందని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper