Pakistan Cricket Team: మన దగ్గర సత్తా లేనప్పుడు.. ఎదుటి వాళ్ళ పేరు నమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ల పేరు వాడుకున్నప్పటికీ ఆ సత్తాను చూపించకపోతే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఇలానే ఉంది.
ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ మూడు రోజుల క్రితం మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అతిపెద్ద తప్పు చేశారు.
పాకిస్తాన్ ప్లేయర్లుగా భారత ఆటగాళ్లను స్క్రీన్ మీద చూపించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీసింది.. పాకిస్తాన్ ప్లేయర్ల టెస్ట్ కెరియర్ అంటూ డిస్ప్లే చేసిన వాళ్లలో రోహిత్, గిల్, తిలక్, రింకు, సర్ మల్టీ ప్లేయర్లు ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు బదులుగా ఇండియన్ ఆటగాళ్ల పేర్లు కనిపించడం ఒకరకంగా చర్చకు దారి తీసింది. దీనిపై ఇండియన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ స్థాయిలో ఇండియన్ ప్లేయర్లను వాడుకున్నప్పటికీ పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం లాభం లేకుండా పోయింది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం భారత ప్లేయర్ల ముఖాలను వాడుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు కు ఒక లాభం చేకూరింది. అదేంటంటే బ్రాడ్కాస్టర్లు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తారో చూద్దామని ఇండియన్ ఫ్యాన్స్ ఆ మ్యాచ్ వీక్షించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ మ్యాచ్ ను ఆన్లైన్లో 11.1 కోట్ల మంది వీక్షించారు. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఆ స్థాయిలో వీక్షణలు నమోదు కావు. ఇండియన్ ఫ్యాన్స్ వల్ల పాకిస్తాన్ జట్టుకు ఈ లాభం జరిగింది.
ఆట తీరులో మాత్రం పాకిస్తాన్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఓపెనర్ అజాన్ సెంచరీ చేశాడు. అబ్దుల్ ఫజల్, సల్మాన్ ఆగా హాప్ సెంచరీలు చేశారు. మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 410 పరుగులు చేసింది. ఇప్పటికే 39 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. పాకిస్తాన్ జట్టుతో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ కు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువే. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ను సవాల్ చేసి బంగ్లాదేశ్ ఆడుతోంది.