spot_img
Homeక్రీడలుTest Cricket : ఒక్కొక్కరిగా తోపులా.. కలిసి ఆడమంటే తుస్సులు.. ఇదీ భారత ఆటగాళ్ల తీరు

Test Cricket : ఒక్కొక్కరిగా తోపులా.. కలిసి ఆడమంటే తుస్సులు.. ఇదీ భారత ఆటగాళ్ల తీరు

Test Cricket : టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీని నిర్వహిస్తోంది. తొలిసారిగా 2021లో ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించింది. తొలి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత, న్యూజిలాండ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుపై ఘన విజయం సాధించి ఈ టైటిల్ తొలి విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ ఏడాది రెండోసారి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగానే జరిగింది. రెండోసారి ఫైనల్ కు చేరిన భారత జట్టు ఆస్ట్రేలియా తో ఓవల్ వేదికగా తుది సమరంలో తలపడింది. దురదృష్టవశాత్తు రెండోసారి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమిపాలైంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనేక మ్యాచ్ ల్లో భారత జట్టు గొప్ప విజయాలను నమోదు చేసుకుంటూ ఫైనల్ కు చేరుతోంది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో మాత్రం దారుణమైన ఆట తీరుతో భారత జట్టు ఓటమి పాలవుతోంది. ఐసీసీ నిర్వహించిన తొలి రెండు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోను భారత జట్టు ఓటమిపాలు కావడం గమనార్హం. అయితే, టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ ఆద్యంతం మాత్రం భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నారు. భారీ పరుగులు చేసి వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021, 2023 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఐదుగురు ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్స్ ల్లో 932 పరుగులు చేయగా, పుజారా 32 ఇన్నింగ్స్ లో 928 పరుగులు చేశాడు. పంత్ 21 ఇన్నింగ్స్ ల్లో 868 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో 758 పరుగులు చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా 21 ఇన్నింగ్స్ ల్లో 721 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 10లో నిలిచారు.
సమష్టిగా రాణించలేక చతికిలపడుతూ..
టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం భారత ఆటగాళ్లు చతికిల పడుతున్నారు. ముఖ్యంగా, సమష్టి ప్రదర్శన కొరవడడంతో జట్టు ఓటమి పాలవుతోంది. కీలక ఆటగాళ్లలో ఒకరు ఆడితే.. మరో ఆటగాడు సరిగా ఆడక పోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత ప్రదర్శనలకే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జట్టు ప్రదర్శనపై ప్రభావంపై పడుతోంది.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper