spot_img
Homeక్రీడలుక్రికెట్‌KL Rahul: నిన్న 4.. నేడు 10.. ఇటువంటి ఆటగాడినా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక...

KL Rahul: నిన్న 4.. నేడు 10.. ఇటువంటి ఆటగాడినా ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేసింది? వీడియో వైరల్

KL Rahul: టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ప్రవేశించాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో గెలవాలి. 5-0 తేడాతో విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగుపెడుతుంది. కానీ అది అంత సులభం కాదు. ఈ నెలలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా తో నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. శుక్రవారం డర్బన్ వేదికగా తొలి మ్యాచ్ మొదలవుతుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు భారత – ఏ జట్టు ఆస్ట్రేలియా – ఏ జట్టుతో అనధికారిక టెస్ట్ మ్యాచులు ఆడుతోంది. తొలి మ్యాచ్ లో భారత జట్టుకు అనుకూలంగా ఫలితం రాలేదు. రెండో మ్యాచ్ లో నైనా విజయం సాధిస్తుందని భావిస్తే.. ఈ మ్యాచ్ లోనూ భారత ఆటగాళ్లు నిరాశ పరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తన వైఫల్యాన్ని చాటుకుంటున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. అతడు వెనుతిరిగిన సందర్భాన్ని చూస్తుంటే ఆశ్చర్యంతో పాటు జాలి కూడా కలుగుతుంది. ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ రాకే చోళీ వేసిన బంతిని రాహుల్ తప్పుగా అంచనా వేశాడు. అది ఏకంగా లెగ్ సైడ్ వెళ్ళిపోతూ వికెట్లను పడగొట్టింది..

చెత్త అంచనా

రాకే చోళి వేసిన బంతి గుడ్డు లెంగ్త్ లో పడినప్పటికీ దానిని రాహుల్ తప్పుగా అనుకున్నాడు. ఆ బంతి తనకు దూరంగా వెళుతుందని అంచనా వేశాడు. కానీ ఆ బంతి ఒక్కసారిగా టర్న్ అయింది. అది లెగ్ వికెట్ వైపు మళ్ళింది. అంతే ఆ బంతిని ఎడమకాలితో నిలువరిద్దామని రాహుల్ అనుకున్నప్పటికీ.. ఆ బంతి లిప్త పాటు కాలంలో లెగ్ వికెట్ ను పడగొట్టింది..దీంతో రాహుల్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లి పోయాడు.

జట్టులో చోటు దక్కదు

రాహుల్ అవుట్ అయిన విధానం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. దీంతో ఇండియా అభిమానులు రాహుల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఇకపై జట్టులో అవకాశం దక్కుతుందనే విషయాన్ని మర్చిపో.. వెంటనే ఇండియాకి వెళ్లి రంజీలు, ఐపీఎల్ లు ఆడుకొమ్మని సలహాలు ఇస్తున్నారు.. పై మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో భారత – ఏ జట్టు ఇప్పటివరకు ఐదు వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి (9), ధృవ్ జురెల్(19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఇన్నింగ్స్ లో భారత – ఏ జట్టు 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా – ఏ జట్టు 223 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత ఏ జట్టు ఆస్ట్రేలియా కంటే ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version