Kane Williamson Comments On Team India: వరుసగా రెండవసారి.. మొత్తంగా మూడవసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా సాధించిన విజయం పట్ల యావత్ ప్రపంచం మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇక టీమ్ ఇండియా అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?
టి20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కెన్ విలియంసన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. టీమిండియా సాధించిన విజయాన్ని అతడు చెప్పిన తీరు గొప్పగా ఉంది. ఇదే సమయంలో టీమిండియా విజయం పట్ల అసూయ వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. ఇతర సో కాల్డ్ వ్యక్తులకు కేన్ విలియంసన్ మాట్లాడిన మాటలు చెప్పు దెబ్బ మాదిరిగా ఉన్నాయి.
కేన్ విలియంసన్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు గెలవాలని కోరుకున్నాడు. కానీ, వాస్తవ ఫలితం మరో విధంగా వచ్చింది. దీంతో విలియంసన్ రియలైజ్ అయిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ప్లేయర్లు ఆడిన తీరు గొప్పగా ఉందని అతడు పేర్కొన్నాడు. “టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. విధ్వంసానికి పరాకాష్టగా ఆటతీరు కొనసాగించారు. అయితే టీమిండియాను ఓడించాలి అంటే ప్రపంచంలో క్రికెట్ ఆడే ఉత్తమ జట్ల నుంచి.. ఉత్తమ ప్లేయర్లను 11 మందిని తీసుకున్నప్పటికీ.. వారిపై కూడా టీమిండియా గెలుస్తుందని” విలియంసన్ పేర్కొన్నాడు.
“కేవలం బెస్ట్ టీం ల నుంచి బెస్ట్ ప్లేయర్లను మాత్రమే కాదు, గ్రహాల నుంచి గ్రహాంతరవాసుల ను తీసుకొచ్చినప్పటికీ టీమ్ ఇండియాకు ఓటమి అనేది ఎదురు కాదు. ఎందుకంటే ఆ జట్టులో ప్లేయర్లు ఇప్పుడు భీకరంగా ఆడుతున్నారు. దేశం కోసం ఎక్కడి దాకైనా వెళ్లే విధంగా కనిపిస్తున్నారు. వారిని ఓడించడం కాదు కదా.. కనీసం గట్టి ఫైట్ ఇవ్వడం కూడా ఇతర ప్లేయర్లకు సాధ్యం కాకపోవచ్చని” విలియమ్సన్ వ్యాఖ్యానించాడు.. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
.