Homeక్రీడలుIndia vs England 5th Test: ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య ఐదో టెస్టు.. ఏం...

India vs England 5th Test: ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య ఐదో టెస్టు.. ఏం జరుగనుంది?

India vs England 5th Test: Fifth Test between India and England

India vs England 5th Test: భారత క్రికెట్ జట్టు జోరుమీదుంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది. భారత బృందం పటిష్టమైన ఆటగాళ్లతో దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లిన ఇండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో దూసుకుపోతోంది. కానీ ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ ఆపేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కోహ్లి సేన ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం. కానీ అది నెరవేరే దారి దగ్గరలో ఉన్నా కరోనా ప్రభావంతో అది కాస్త దూరమైపోతోంది.

మొదట్లో ఐదో టెస్ట్ నిర్వహించాలని భావించినా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరు జట్ల ఏకాభిప్రాయంతోనే మ్యాచ్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఐదో టెస్టును త్వరలోనే నిర్వహించేందుకు ఈసీబీ (ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) తో పని చేస్తామని ఇండియా జట్టు ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్ రద్దవడంపై క్రికెట్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ అవుతోంది.

టీమిండియా జోరుకు మ్యాచ్ రద్దు కావడం కళ్లెం వేసినట్లు అయింది. ఇప్పటికే జోరు మీదున్న టీమిండియాకు చివరి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. చివరి ఆటలో సత్తా చూపి చరిత్ర కెక్కాలని అనుకున్నా అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గాలనే కల కలగానే మిగులుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ అభిమానుల కోరిక నెరవేరడం లేదు. ఐదో మ్యాచ్ జరిగితే కచ్చితంగా ఫలితం మనకే అనుకూలంగా వస్తుందని ఆటగాళ్లలో బలమైన కాంక్ష ఉన్నా కలిసి రావడం లేదు. దీంతోనే ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలనే ఆశ మరికొంత కాలం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మళ్లీ తరువాత జరిగే ఆటలపైనే దృష్టి సారించాల్సి వస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version