spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Aus : భారత్ కొట్టిన దెబ్బ మామూలుదా.. ఆస్ట్రేలియా ఆర్మీ నేలచూపులు చూస్తోంది..

Ind Vs Aus : భారత్ కొట్టిన దెబ్బ మామూలుదా.. ఆస్ట్రేలియా ఆర్మీ నేలచూపులు చూస్తోంది..

Ind Vs Aus :  పెర్త్ టెస్టుల్లో టాస్ భారత్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 37, కేఎల్ రాహుల్ 26 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగతా ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. ప్రమాదకరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ 0 పరుగులకు అవుట్ అయి పరువు తీసుకున్నాడు. మరో ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా 0 పరుగులకే అవుట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు . స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. కమిన్స్, స్టార్క్, మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.. టీమ్ ఇండియా 150 పరుగులకు అలౌట్ కావడంతో.. ఆస్ట్రేలియా నెటిజన్లు తమ వక్ర బుద్ధిని ప్రదర్శించారు. టీమిండియాను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో విచిత్ర విచిత్రమైన పోస్టులు పెట్టారు. న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయిందని.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై అదే నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తోందని.. 150 పరుగులకే కుప్ప కూలిందని.. ఇలాంటి జట్టు ఆస్ట్రేలియా ను ఎలా ప్రతిఘటిస్తుందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇవి సహజంగానే టీమిండియా అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక టీమిండియా అభిమానులు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. అయితే టీమిండియా కెప్టెన్ బుమ్రా తన బౌలింగ్ తో రెచ్చిపోవడంతో అభిమానులకు ఎక్కడా లేని ఆనందం కలిగింది.

అభిమానుల్లో ఆనందం

బుమ్రా నిప్పులు జరిగే విధంగా బంతులు వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు కోలుకోలేకపోయారు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ క్రీజ్ లో ఉండేందుకు ఆపసోపాలు పడ్డారు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా అభిమానులను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. “150 పరుగులు చేస్తే విమర్శించారు కదా.. ఇప్పుడేమంటారు. ఆడుతోంది మీ స్వదేశంలో.. 67 పరుగులకే 7 వికెట్ల కోల్పోయింది.. ఇంకేం కోలుకుంటుంది.. రేపు ఉదయం మీరు వేసే సమయానికి ఆల్ అవుట్ అవుతుంది. వంద పరుగులకు మించి చేయడం కష్టమే. ఇలాంటి జట్టును పట్టుకొని మీరు గొప్ప గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు.. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. విమర్శలు చేసే ముందు ఆలోచించుకోండి. అంతేతప్ప ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని” టీమిండియా నెటిజన్లు పేర్కొన్నారు. మొత్తంగా పెర్త్ టెస్ట్ తొలి రోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా పై చేయి సాధిస్తే.. సోషల్ మీడియాలో కాస్త ఆలస్యంగానైనా టీమిండియా అభిమానులు అప్పర్ హ్యాండ్ సాధించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Oktelugu Epaper
Exit mobile version