Homeక్రీడలుక్రికెట్‌Virat And Rohit: విరాట్, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడాలంటే.. ఇది జరగాలి..

Virat And Rohit: విరాట్, రోహిత్ 2027 ప్రపంచ కప్ ఆడాలంటే.. ఇది జరగాలి..

Virat And Rohit: కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు. ఒక మామూలు ఆటగాడిని చేశారు. పైగా అతని వయసు 37 సంవత్సరాలు.. ఇంతటి వయసులో అతడు ఇంకా క్రికెట్ ఏం ఆడతాడు.. జట్టులో ఎలా కొనసాగుతాడు.. రోహిత్ గురించి కొద్దిరోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చ ఇది..

లండన్ లో స్థిరపడ్డాడు. బీసీసీఐ చెప్పినట్టుగా సాధన చేయడం లేదు. ఒక పట్లగా అతని బ్యాటింగ్లో దూకుడు లేదు. వయసు కూడా మీద పడుతోంది. శరీర సామర్థ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఒక పట్లగా అతడి నుంచి మెరుగైన ఇన్నింగ్స్ రావడం లేదు. ఇలాగైతే కష్టమే. విరాట్ గురించి వినిపిస్తున్న విశ్లేషణ ఇది..

టీమిండియాలో రోహిత్, విరాట్ ద్వయం సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. వీరిద్దరూ ఒకరకంగా టీమిండియా క్రికెట్ మొత్తాన్ని శాసించారు. కొన్ని సందర్భాలలో ఓటములను కూడా తప్పించి టీమ్ ఇండియాకు విజయాలు అందించారు. తద్వారా తమకంటూ సరికొత్త చరిత్రను సృష్టించుకున్నారు. అటువంటి ఆటగాళ్లు నేడు జట్టులో మామూలు ప్లేయర్లుగా మిగిలిపోయారు. మేనేజ్మెంట్ సైతం శాసించిన వీరిద్దరూ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయారు. వీరిద్దరి అనుభవం టీమ్ ఇండియాకు ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా 2027లో వన్డే వరల్డ్ కప్ సాధించాలి అనుకుంటే టీమిండియాలో వీరిద్దరూ కచ్చితంగా ఉండాలి. కానీ మేనేజ్మెంట్ ఆలోచనలు ఆ విధంగా లేవు. 2027 వరల్డ్ కప్ విషయంలో మేనేజ్మెంట్ లెక్కలు వేరే ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు క్లారిటీ లేకపోయినప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ జట్టులో ఉండాలంటే మేనేజ్మెంట్ ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ దానికి గనక రోహిత్, విరాట్ కట్టుబడి ఉంటే కచ్చితంగా 2027 వరల్డ్ కప్ లో వారిద్దరు ఆడతారని తెలుస్తోంది.

ఆటగాళ్లలో సామర్థ్యం పెంచడానికి మేనేజ్మెంట్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నాలను ఆటగాళ్లు కచ్చితంగా నూటికి నూరు శాతం చేయాలని మేనేజ్మెంట్ బలంగా కోరుతోంది. మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఈ నిబంధనల వల్ల టీమ్ ఇండియాలో కాస్త మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో టీమ్ ఇండియా మెరుగైన ఆట తీరు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో ట్రోఫీ దక్కించుకోలేకపోయినప్పటికీ.. ప్రత్యర్థికి గెలిచే అవకాశం ఇవ్వలేదు టీం ఇండియా. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వెస్టిండీస్ జట్టు పై ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇవన్నీ కూడా మంచి శకునములుగా ఉండడంతో వీటిని కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

అందువల్లే విరాట్, రోహిత్ తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కట్టుదిట్టమైన విధానాలను పాటించాలని మేనేజ్మెంట్ సూచిస్తుంది. అందువల్లే వారిద్దరూ వీలు దొరికిన ప్రతి సందర్భంలోనూ దేశవాళీ క్రికెట్ ఆడాలని నిబంధనలు విధించింది. వారిద్దరి మాత్రమే కాదు.. మిగతా ప్లేయర్లు కూడా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి.. డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని సూచిస్తోంది. ఇప్పటికే t20, టెస్ట్ ఫార్మాట్లకు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికారు. అలాంటప్పుడు వన్డేలలో వారు 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగాలి అంటే కచ్చితంగా మేనేజ్మెంట్ చెప్పినట్టు వినాలి. ఇప్పటికే రోహిత్ ఆ పని చేస్తున్నప్పటికీ.. ఒక విరాట్ మాత్రం అంతగా ప్రాక్టీస్ చేయడం లేదని తెలుస్తోంది. ఒకవేళ విరాట్ గనుక రోహిత్ బాటలో ప్రయాణం చేస్తే.. వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ లో జట్టులో ఆడతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Oktelugu Epaper
Exit mobile version