Homeక్రీడలుICC Rankings: ప్రపంచంలోనే నంబర్ 1 ఆల్ రౌండర్ గా మన రవీంద్ర జడేజా

ICC Rankings: ప్రపంచంలోనే నంబర్ 1 ఆల్ రౌండర్ గా మన రవీంద్ర జడేజా

ICC Rankings: శ్రీలంకతో తొలి టెస్టులో సెంచరీ (175) చేసిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దూసుకుపోయారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ విభాగంలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచారు. జడేజా ఇంతకుముందు 2017 ఆగస్టులో కూడా వారం పాటు నంబర్ 1 ఆల్ రౌండర్ గా కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్లు ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి చేరుకున్నారు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ శతకం (175)తోపాటు బంతితోనూ చెలరేగి రెండు ఇన్నింగ్స్ లలో 9 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దూసుకుపోయాడు. బ్యాటింగ్ విభాగంలో 17 స్థానాలు మెరుగుపడి 54వ ర్యాంకు నుంచి 37వ ర్యాంకులోకి వచ్చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో 17 వ ర్యాంకు దక్కించుకున్నాడు. మరో ఆల్ రౌండర్ అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో, రోహిత్ శర్మ 6వ స్థానంలో , రిషబ్ పంత్ 10వ స్తానంలో ఉన్నారు. బౌలింగ్ లో అశ్విన్ 2, బుమ్రా 10వ స్థానంలో ఉన్నారు.

ఇక టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ గా నామినేట్ అయ్యారు. గత నెలలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో శ్రేయాస్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ గైర్హాజరీతో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్ 174.35 స్ట్రైక్ రేట్ తో 204 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్ లలోనూ మూడు అర్థ శతకాలు సాధించాడు.

ఇక ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా మహిళా క్రికెట్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు కూడా ఎంపికయ్యారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version