spot_img
Homeక్రీడలుక్రికెట్‌Deepa Karmakar : దీపా కర్మాకర్ సరికొత్త ఘనత.. తొలి భారత అథ్లెట్ గా చరిత్ర..

Deepa Karmakar : దీపా కర్మాకర్ సరికొత్త ఘనత.. తొలి భారత అథ్లెట్ గా చరిత్ర..

Deepa Karmakar : ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ లో సరికొత్త రికార్డు నమోదయింది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సరికొత్త ఘనతను సృష్టించింది. ఏషియన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఉజ్బెకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగగా.. ఆదివారం ముగిసింది. ఈ టోర్నీలో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ బంగారు పతకాన్ని ఒడిసి పట్టింది.

హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 8 మంది జిమ్నాస్ట్ లు పాల్గొన్నారు. అయితే వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కర్మాకర్ అగ్రస్థానంలో నిలిచింది. అసాధారణ ప్రతిభతో పసిడి పథకాన్ని సాధించింది.. 2015 సంవత్సరంలో జరిగిన ఇదే టోర్నీలో దీపా చివరిసారిగా కాంస్య పతకాన్ని అందుకుంది. ఇక తాజా ఎడిషన్ లో కూడా దీపా అద్భుతమైన ప్రదర్శన చేసింది. 8 మంది ప్రపంచ శ్రేణి జిమ్నాస్ట్ లు పోటీపడినప్పటికీ.. వ్యక్తిగత వాల్ట్ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించింది.

దీపా కర్మాకర్ కు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో 13. 566 సగటు నమోదు చేసింది. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ 13.466, జో క్యోమ్ గ్ 12.966 సగటుతో రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. 2016 రియో ఒలంపిక్స్ లో దీపా నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్లాస్గో వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో దీప కాంస్య పతకాన్ని అందుకుంది.

అప్పట్లో నిషేధిత ఉత్ప్రే రకం వాడిందనే కారణంతో దీపా 21 నెలల నిషేధం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తన నిషేధాన్ని సాధనకు అనువుగా మలుచుకొని దీపా ఉత్తేజ తరంగంగా ఎగిసింది. అనంతరం మళ్లీ బరిలోకి దిగి.. మొదటి టోర్నీ లోనే బంగారు పతకాన్ని సాధించింది. 2015 లో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో దీపా కాంస్య పకాన్ని అందుకుంది. 2019లో వ్యక్తిగత వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ కాంస్య పతకాన్ని అందుకుంది. 2022 లోనూ వ్యక్తిగత వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ కాంస్య పతకాన్ని అందుకుంది. తాజా ఎడిషన్ లో దీపా కర్మాకర్ వ్యక్తిగత వాల్ట్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version