spot_img
Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir : కివీస్ పై సిరీస్ కోల్పోయిన తర్వాత.. గంభీర్ కు వాస్తవం బోధపడింది.....

Gautam Gambhir : కివీస్ పై సిరీస్ కోల్పోయిన తర్వాత.. గంభీర్ కు వాస్తవం బోధపడింది.. ఆ విషయంలో పీచే మూడ్!

Gautam Gambhir : న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సీరీస్ ను టీమిండియా 2-0 తేడాతో ఇప్పటికే కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన టీమ్ ఇండియా.. పూణే టెస్ట్ లో విజయం సాధిస్తుందని సగటు భారతీయ అభిమాని భావించాడు. టీమిండియా గెలవాలని పూణే మైదానాన్ని స్పిన్ ట్రాక్ గా మార్చారు కూడా. కానీ అంతిమంగా ఫలితం న్యూజిలాండ్ జట్టుకు అనుకూలంగా వచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. గల్లి స్థాయి క్రికెట్ ఆడి.. పరువు తీసుకున్నారు. పూణే మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగా.. టీమ్ ఇండియా మాత్రం పూర్తిగా తడబడింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు 103 లీడ్ లభించింది. అది రోహిత్ సేన ఓటమిని శాసించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ తన కెరియర్ లోనే అద్భుతమైన గణాంకలను నమోదు చేశాడు. ఏకంగా 13 వికెట్లను పడగొట్టాడు.

హోరా హోరిగా సాగే అవకాశం..

ఇప్పటికే రెండు టెస్టులనుఓడిపోయినన టీమ్ ఇండియా.. చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ కు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా రెడీ అవుతోంది. ఇదే క్రమంలో టీమిండియా గౌతమ్ గంభీర్ పీచే మూడ్ అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నాడు. వాంఖడే మైదానాన్ని బ్యాటింగ్ కు అనుకూలంగా రూపొందించాలని క్యూ రేటర్ కు సూచించినట్టు తెలుస్తోంది. మొదటిరోజు బ్యాటింగ్, రెండవ రోజు నుంచి స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే విధంగా మైదానాన్ని తయారు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పూణే మైదానంలో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో భారతీయ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు టెస్ట్ లోనూ పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో టీమిండి ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు కేవలం 46 పరుగులకే భారత జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వరుస ఓటములతో టీమిండియా ఇబ్బంది పడుతుండగా.. సిరీస్ ఇప్పటికే గెలిచిన ఆనందంలో న్యూజిలాండ్ ఉంది. తొలిసారిగా భారత జట్టుపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలిచింది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.. మరోవైపు చివరి టెస్టులో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. మొత్తంగా చూస్తే మూడవ టెస్ట్ కూడా హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. “మైదానాన్ని పకడ్బందీగా రూపొందిస్తున్నాం. బౌలింగ్, బ్యాటింగ్ కు సమానంగా ఉండేలా మైదానాన్ని రూపొందిస్తున్నాం. వికెట్ పై కొంతమేర గడ్డిని వదిలేసాం. తొలి రోజు మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. రెండవ రోజు నుంచి స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని” వాంఖడే స్టేడియం అధికారి వివరించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version