Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli reacts to Bengaluru victory: బెంగళూరు విజయంపై మౌనం.. ఇన్నాళ్లకు కోహ్లీ స్పందించాడు.....

Virat Kohli reacts to Bengaluru victory: బెంగళూరు విజయంపై మౌనం.. ఇన్నాళ్లకు కోహ్లీ స్పందించాడు.. వైరల్ వీడియో..

Virat Kohli reacts to Bengaluru victory: ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు 2024 వరకు దరిద్రం వైఫై లాగా ఉండేది. అనేక పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ ఆదుకోలేకపోయింది. ఇకపై ఎప్పటికీ ట్రోఫీ అందుకోలేదా.. బెంగళూరు జట్టుకు ఆ యోగం లేదా అని చాలామంది కామెంట్ చేసేవారు. ఇక అభిమానులైతే తీవ్రంగా కలత చెందేవారు. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది.

గత ఏడాది బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించింది. తద్వారా తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది కూడా బెంగళూరు అదరగొట్టింది. ప్రారంభం నుంచి విజేతగా నిలిచే వరకు సత్తా చూపించింది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టను వారి సొంత మైదానంలో ఓడించి సత్తా చూపించింది. తద్వారా వరుసగా రెండవసారి ట్రోఫీ అందుకొని సరికొత్త చరిత్రను లిఖించింది.

బెంగళూరు సాధించిన విజయం పట్ల ఆ జట్టు ఆటగాళ్లు రకరకాలుగా స్పందించారు. కోహ్లీ తీన్మార్ డాన్స్ వేసినప్పటికీ.. తన అసలైన ప్రతిస్పందన మాత్రం తెలియజేయలేదు. దీంతో అభిమానుల్లో ఏదో ఒక కలత ఉండేది. అనుమానం కూడా ఉండేది. అయితే వాటన్నింటిని విరాట్ కోహ్లీ పటా పంచలు చేశాడు. ఒక స్పెషల్ వీడియోతో అభిమానులను ఆకట్టుకున్నాడు..

“ఈ సీజన్ ను సానుకూల దృక్పథంతో ప్రారంభించాం.. చివరికి విజేతగా నిలిచి దానిని ముగించాం.. వరుసగా రెండుసార్లు ట్రోఫీలు గెలవడం చాలా గొప్ప విషయం. బెంగళూరు దీనిని సాధించింది.. విజయాలు సాధ్యమయ్యాయి. ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టింది. అడ్డంకులు కూడా అవరోధాలు కలిగించాయి. ఇవన్నీ కూడా ఫాన్స్ సపోర్ట్ వద్దు పారిపోయాయి. అని భావోద్వేగాలను జట్టుగా కలిసి అనుభవించాం. బెంగళూరు జట్టు నాకు ఇల్లు లాంటిది.. ఈ అభిమానాన్ని మర్చిపోలేనని.. ఈ ట్రోఫీ సాధించడానికి గొప్పగా భావిస్తున్నానని” విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఏకంగా 675 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తనదైన స్టైల్ లో బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ చివరి వరకు నిలబడి సొంత జట్టును గెలిపించి.. విజేతగా నిలబడేలా చేశాడు. గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తనను రన్ మిషన్ అని ఎందుకంటారో.. చేజ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. కాగా విరాట్ కోహ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version