Honeymoon dispute leads to divorce: సరిగా గత ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన సోనం, రఘు వంశీ అనే నూతన దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే సోనికి గతంలోనే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అతడితో పెళ్లి జరిపించాలని చెబితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో రఘు వంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. రఘు వంశీతో ఉండడం ఇష్టం లేక సోనీ తన ప్రియుడిని అక్కడికి పిలిపించుకుంది. అతడి సహాయంతో రఘు వంశీని అంతం చేసింది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం కలిగించింది.
ఈ ఘటన జరిగిన తర్వాత హనీమూన్ కు వెళ్లే వారి దంపతుల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని కేసులు కూడా ఇటువంటివే వెలుగులోకి వచ్చాయి.. దీంతో చాలామంది యువకులు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్.. రాష్ట్రానికి చెందిన చాలామంది యువకులు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మేఘాలయ హనీమూన్ తరహా కేసులు చాలావరకు వెలుగులోకి వచ్చాయి. మీడియా కూడా వాటికి విపరీతమైన ప్రయారిటీ ఇవ్వడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది.
తాజాగా ఇటువంటి హనీమూన్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది చాలా వింతగా ఉంది. హనీమూన్ వెళ్లి.. దగ్గరవలసిన భార్యాభర్తలు.. చివరికి విడిపోయారు. విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో చోటుచేసుకుంది. మీరట్ ప్రాంతానికి చెందిన యువతితో ఢిల్లీ నగరానికి చెందిన యువకుడికి వివాహం జరిగింది. ఆ తర్వాత నూతన దంపతులు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కాబోయే భర్త నుంచి ఏకాంతాన్ని కోరుకున్న ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
హనీమూన్ కు ఆ యువకుడు తన తోబుట్టువు.. పేరెంట్స్ ను తీసుకొచ్చాడు. ఇది ఆ నూతన వధువుకు నచ్చలేదు. భర్తతో ఏకాంతం లభించలేదు. దీంతో ఆమెలో నైరాశ్యం పెరిగిపోయింది. మరో మాటకు తాగు లేకుండా విడాకులకు దరఖాస్తు చేసింది. ఇప్పటివరకు మూడుసార్లు ముఖాముఖీ నిర్వహించినప్పటికీ నూతన దంపతుల్లో మార్పు రాలేదు. దీంతో మరో సెషన్ కౌన్సిలింగ్ నిర్వహించి.. ఆ తదుపరి చర్యలను కోర్టు తీసుకునే అవకాశం ఉంది.
తన భార్య వాదనతో ఆ భర్త అంగీకరించడం లేదు. పేరెంట్స్ ని తీసుకొస్తే తప్పేంటి అని అతడు వాదిస్తున్నాడు. భార్యనేమో హనీమూన్ కి వెళ్తే తోడుగా పేరెంట్స్ ఎందుకని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. ఇండోర్ లాంటి ప్రాంతంలో భార్య భర్తను చంపితే.. మీరట్ ప్రాంతంలో మాత్రం హనీమూన్ కు తన భర్త పేరెంట్స్ ను తీసుకురావడంతో భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా హనీమూన్ కేసులు మనదేశంలో భలే సాగుతున్నాయి.
