Homeజాతీయ వార్తలుHoneymoon dispute leads to divorce: భర్తతో హనీమూన్.. అక్కడే అనుకోని ఘటన.. ఆ తర్వాత...

Honeymoon dispute leads to divorce: భర్తతో హనీమూన్.. అక్కడే అనుకోని ఘటన.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Honeymoon dispute leads to divorce: సరిగా గత ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన సోనం, రఘు వంశీ అనే నూతన దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే సోనికి గతంలోనే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అతడితో పెళ్లి జరిపించాలని చెబితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో రఘు వంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. రఘు వంశీతో ఉండడం ఇష్టం లేక సోనీ తన ప్రియుడిని అక్కడికి పిలిపించుకుంది. అతడి సహాయంతో రఘు వంశీని అంతం చేసింది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం కలిగించింది.

ఈ ఘటన జరిగిన తర్వాత హనీమూన్ కు వెళ్లే వారి దంపతుల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని కేసులు కూడా ఇటువంటివే వెలుగులోకి వచ్చాయి.. దీంతో చాలామంది యువకులు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్.. రాష్ట్రానికి చెందిన చాలామంది యువకులు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మేఘాలయ హనీమూన్ తరహా కేసులు చాలావరకు వెలుగులోకి వచ్చాయి. మీడియా కూడా వాటికి విపరీతమైన ప్రయారిటీ ఇవ్వడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది.

తాజాగా ఇటువంటి హనీమూన్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే అది చాలా వింతగా ఉంది. హనీమూన్ వెళ్లి.. దగ్గరవలసిన భార్యాభర్తలు.. చివరికి విడిపోయారు. విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో చోటుచేసుకుంది. మీరట్ ప్రాంతానికి చెందిన యువతితో ఢిల్లీ నగరానికి చెందిన యువకుడికి వివాహం జరిగింది. ఆ తర్వాత నూతన దంపతులు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కాబోయే భర్త నుంచి ఏకాంతాన్ని కోరుకున్న ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

హనీమూన్ కు ఆ యువకుడు తన తోబుట్టువు.. పేరెంట్స్ ను తీసుకొచ్చాడు. ఇది ఆ నూతన వధువుకు నచ్చలేదు. భర్తతో ఏకాంతం లభించలేదు. దీంతో ఆమెలో నైరాశ్యం పెరిగిపోయింది. మరో మాటకు తాగు లేకుండా విడాకులకు దరఖాస్తు చేసింది. ఇప్పటివరకు మూడుసార్లు ముఖాముఖీ నిర్వహించినప్పటికీ నూతన దంపతుల్లో మార్పు రాలేదు. దీంతో మరో సెషన్ కౌన్సిలింగ్ నిర్వహించి.. ఆ తదుపరి చర్యలను కోర్టు తీసుకునే అవకాశం ఉంది.

తన భార్య వాదనతో ఆ భర్త అంగీకరించడం లేదు. పేరెంట్స్ ని తీసుకొస్తే తప్పేంటి అని అతడు వాదిస్తున్నాడు. భార్యనేమో హనీమూన్ కి వెళ్తే తోడుగా పేరెంట్స్ ఎందుకని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. ఇండోర్ లాంటి ప్రాంతంలో భార్య భర్తను చంపితే.. మీరట్ ప్రాంతంలో మాత్రం హనీమూన్ కు తన భర్త పేరెంట్స్ ను తీసుకురావడంతో భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా హనీమూన్ కేసులు మనదేశంలో భలే సాగుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version