IPL CSK: చెన్నై చెక్కేసింది.. ధోని మొదలెట్టాడు!

ఐపీఎల్ లో అందరికంటే ముందే చెన్నై సర్దుకుంది. ఆగిపోయిన ఐపీఎల్ లో యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ టోర్నీ ఇంకా నెల రోజులు సమయం ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ టీం తమ ఆటగాళ్లను యూఏఈ పంపించేసింది. కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఈరోజు యూఏఈకి విమానంలో వెళ్లిపోయి ల్యాండ్ అయ్యారు. యూఏఈలో మరో నెలరోజుల్లోనే ఆగిపోయిన ఐపీఎల్ మొదలుకానుంది. ఈక్రమంలోనే ఐపీఎల్ టీంలన్నీ అక్కడ ఏర్పాట్లు […]

Written By: NARESH, Updated On : August 14, 2021 5:00 pm
Follow us on

ఐపీఎల్ లో అందరికంటే ముందే చెన్నై సర్దుకుంది. ఆగిపోయిన ఐపీఎల్ లో యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ టోర్నీ ఇంకా నెల రోజులు సమయం ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ టీం తమ ఆటగాళ్లను యూఏఈ పంపించేసింది. కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఈరోజు యూఏఈకి విమానంలో వెళ్లిపోయి ల్యాండ్ అయ్యారు.

యూఏఈలో మరో నెలరోజుల్లోనే ఆగిపోయిన ఐపీఎల్ మొదలుకానుంది. ఈక్రమంలోనే ఐపీఎల్ టీంలన్నీ అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మూడు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ టీం అందరికంటే ముందే సర్దుకుంది. ఈ మేరకు చెన్నై కెప్టెన్ ధోని సహా ఆటగాళ్లంతా యూఏఈ వెళ్లిన ఫొటోలను ట్వీట్ చేశారు.

కెప్టెన్ ఎంఎస్ ధోని, చెన్నై ఆటగాళ్లు సురేష్ రైనా, రుతురాజ్ గైక్వైడ్, రాబిన్ ఉతప్ప సహా క్రికెటర్లు, సహాయక సిబ్బంది దుబాయ్ కు చేరుకున్నారు. వారితోపాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. ‘దుబాయ్ కు మరోసారి వణక్కం’ అని ట్వీట్ చేసింది.

దీంతో పాటు రజినీకాంత్ నరసింహలోని పాటను జోడించి వీడియోను ఆసక్తికరంగా మలిచింది. గత ఏడాది ఐపీఎల్ లో చెన్నై చిత్తుగా ఓడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి మంచి ఫామ్ లో ఉండి తొలి అర్థభాగంలో బాగా రాణించింది. ఐదు మ్యాచుల్లో రెండింట్లోనే ఓడింది. పాయింట్ల టేబుల్ లో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే నెలరోజుల ముందుగా జట్టు సన్నాహాకాలు మొదలుపెట్టింది.

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న తన తొలి మ్యాచ్ ను చెన్నై ఏకంగా చాంపియన్ ముంబైతో తలపడనుంది..

సీఎస్కే షేర్ చేసిన వీడియోను కింద చూడొచ్చు..

https://twitter.com/ChennaiIPL/status/1426235215098179584?s=20