Homeఆధ్యాత్మికంRashi Phalalu: దీపావళి సందర్భంగా ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. నేడు రాశిఫలాలు ఏవిధంగా...

Rashi Phalalu: దీపావళి సందర్భంగా ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. నేడు రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: దీపావళి పండుగ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం కలగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 12న ఆదివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఐదు రాశుల వారి ఇంట్లో లక్ష్మీ దేవత ఆగమనం చేయనుంది. 2023 నవంబర్ 12న 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఆశయాలు నెరవేర్చడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విషయాల్లో తొందరపడకూడదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

వృషభం:
కొన్ని పనులు కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

మిథునం:
ఈరాశివారికి నేడు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు ఉంటుంది. ఇంట్లో పనులకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

కర్కాటకం:
కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. కొత్త పనులు చేపట్టడంలో బిజీ అవుతారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న బంధువును కలుస్తారు.

సింహం:
ఉద్యోగులకు అనుకూల సమయం. పదోన్నతులు పొందే ఛాన్స్. ఆర్థిక ప్రయోజనాలు ఆశించినంతంగా ఉంటాయి. పెండింగు పనులు పూర్తి చేస్తారు.

కన్య:
ఓ విషయంపై ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాగ్వాదానికి దిగొద్దు. వ్యాపారులు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. శత్రువులతో దూరంగా ఉండండి..

తుల:
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. పుష్యక్షేత్రానికి వెళ్లడానికి ప్లాన్ వేస్తారు.

వృశ్చికం:
పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అప్పులను చెల్లించడంలో శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం.

ధనస్సు:
ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కొన్ని పనుల్లో అనూహ్య విజయం సాధిస్తారు. అప్పు ఉంటే దానిని చెల్లించడంలో శ్రద్ధ చూపుతారు. విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.

మకరం:
కొన్ని శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తికావడానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యారంగానికి మెరుగైన ఫలితారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మీనం:
ఖర్చులు పెరిగే అవకాశం ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ వార్త ఆందోళనను కలిగిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version