Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశివారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.. 2023 అక్టోబర్ 5న రాశి ఫలాలు...

Rashi Phalalu: ఈ రాశివారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.. 2023 అక్టోబర్ 5న రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 5న గురువారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
బంధుమిత్రులతో కలిసి కొన్నికీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు సేకరిస్తారు. ప్రారంభించబోయే పనులను ఆపేయకుండా ముందుకు సాగించండి. అధికారుల నుంచి సహకారాలు తీసుకుంటారు. ఈ రాశివారు దుర్గాదేవి దర్శనం చేస్తే మంచిఫలితాలు ఉంటాయి.

వృషభం:
అనవసర ఖర్చలు విషయంలో జాగ్రత్తలు వహించాలి.నూతన వస్తువులను సేకరిస్తారు. కొత్తపనులు మొదలుపెట్టేటప్పుడు ఆటంకం ఎదురుకాకుండా చూసుకోవాలి.హనుమాన్ ఆరాధర చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

మిథునం:
కొన్ని సాహసోసేత నిర్ణయాలు విజయాలను చేకూరుస్తాయి. కొన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. విష్ణు దర్శనం చేస్తే కలిసివస్తుంది.

కర్కాటకం:
వ్యాపారం చేసే వారికి అనుకూలమైన రోజు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది.అయితే అనవసర విషయాల జోలికి వెళ్లకుడా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

సింహం:
ప్రణాళికలు వేసి ముందుకు సాగాలి. కొన్ని నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వృత్తిఉద్యోగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉండే ఛాన్స్.ఈ రాశి వారు గోవింద నామాలు చదవడం వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య:
కుటుంబ సభ్యలతో చర్చలు జరపడం వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి ఫలితాలు.

తుల:
సొంతనిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. అయితే లక్ష్యంపై ఏకాగ్రతను కోల్పోకూడదు. దుర్గాదేవి పూజ చేయడంతో మంచి ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం:
ఒత్తిడిని కలిగి ఉంటారు. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గొప్పవారితో పరిచయాలు ఆనందాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య దేవ స్వామిని కొలిస్తే శుభ ఫలితాలు.

ధనస్సు:
పట్టుదలతో కలిగి ఉంటారు. ఇదే అనుకూలిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. లక్ష్మీధ్యానం చేయడం వల్ల మనో ధైర్యం పెరుగుతుంది.

మకరం:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. శివారాధన మరిన్ని ఫలితాలు ఇస్తుంది.

కుంభం:
కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ముందుకు సాగాలి. శ్రమ పెరుగుతుంది. సమాచారం లోపం లేకుండా చూసుకోవాలి. ఇతరులతో ఎక్కువగా వాదించడం వల్ల నష్టపోతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా అనుకూల ఫలితాలు.

మీనం:
మనోదైర్యాన్ని కోల్పోకుండా ఉడాలి. తోటివారి సహకారం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version