Homeఆధ్యాత్మికంDevunigutta Temple: దట్టమైన అడవిలో.. అతిపెద్ద ఆలయం.. అభివృద్ధి చేస్తే "అంకోర్ వాట్" అవుతుంది.. తెలంగాణలో...

Devunigutta Temple: దట్టమైన అడవిలో.. అతిపెద్ద ఆలయం.. అభివృద్ధి చేస్తే “అంకోర్ వాట్” అవుతుంది.. తెలంగాణలో ఇది ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలంటే?

Devunigutta Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందంటే.. మరో మాటకు తావు లేకుండా ఆంకోర్ వాట్ అని చెబుతారు. ఈ ఆలయం కాంబోడియాలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని భారతదేశానికి చెందిన రాజులు పరిపాలించేవారు. వారి పరిపాలన కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో దేశాలు ఏర్పాటు కావడంతో ఈ ఆలయం కాంబోడియాకు పరిమితమైంది.

Also Read: స్వేచ్ఛకు గతంలోనే రెండు వివాహాలు.. పూర్ణచందర్ సంచలన లేఖ వైరల్

ఆంకోర్ వాట్ లాంటి ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు అడవుల్లో ఉంది. దేవుని గుట్ట ప్రాంతంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణం అత్యంత విశిష్టంగా ఉంది. చరిత్రకారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆలయ నిర్మాణ శైలి కూడా విచిత్రంగా కనిపిస్తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు ప్రాంతంలోని కొత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న దేవుని గుట్టలపై ఈ ఆలయం నిర్మితమై ఉంది. దీనిని స్థానికులు దేవుని గుట్ట ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఇసుకరాయితో నిర్మించారు.. 2×2 అడుగులు, 2×1 అడుగుల కొలతలతో ఈ ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణంలో రాతిబిల్లలను ఉపయోగించారు. ఆలయ నిర్మాణాన్ని పిరమిడ్ మాదిరిగా చేపట్టడం విశేషం.. ఆలయ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన గోడలమందం 9 అడుగులుగా ఉంది. గోడల మధ్యలో ఖాళీ వదిలారు. ఇలా వదలడం వల్లనే వందల సంవత్సరాల గడిచినప్పటికీ ఆలయం ఇంతవరకు చెక్కుచెదరలేదు.

ఈ ఆలయంలో పలికి వెళ్లడానికి తూర్పు వైపున ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్న గోడలపై బుద్ధుడి చరిత్ర కనిపిస్తోంది. శిల్పాలు కూడా నాటు చరిత్రను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన గోడపై బుద్ధుడు తన శిష్యులకు పాఠాలు బోధిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో గోడకు యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో రాజు చేతిలో ఖడ్గంతో ఉన్నాడు. బౌద్ధ జాతక కథలకు సంబంధించిన నేపథ్యాన్ని వివరించే శిల్పాలు గోడల మీద కనిపిస్తున్నాయి. గుడి ఎదురుగా పాలరాతి కర్రతో చేసిన స్తంభం కనిపిస్తోంది. దీనిని ఆయక స్తంభం అని స్థానికులు పిలుస్తున్నారు. బౌద్ధ స్తూపాల ఎదురుగా ఇలాంటి ఆయక స్తంభం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ స్తంభానికి నాలుగు వైపులా అర్థ పద్మాలు.. సింహాలు కనిపిస్తున్నాయి.

బౌద్ధులకు స్థావరంగా చైత్యాలయాన్ని పిలుస్తారు. అయితే దానికంటే ముందే దేవుని గుట్టలు బౌద్ధులకు స్థావరం గా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఈ ఆలయంలోని దక్షిణం వైపు ఉన్న గోడమీద పద్మపాణి ని పోలి ఉన్న బోధి సత్వుడు కనిపిస్తున్నాడు. బోధిసత్వుడు లలితాసనంలో రాణితో కూర్చున్న ఆసనం ఈ దృశ్యంలో కనిపిస్తోంది. ఇక పడమర వైపు ఉన్న గోడ మీద అర్ధనారీశ్వర రూపంలో ఒక శిల్పం చెక్కి కనిపిస్తోంది. ఆ శిల్పంలో ఈశ్వరుడు, పార్వతి దేవి స్పష్టంగా కనిపిస్తున్నారు.. ఇక అదే పై వరుసలో బుద్ధుడు బోధనలు చెబుతుంటే రాజులు, రానులు వింటున్నారు. మిధునాలు కూడా ఈ శిల్పంలో కనిపిస్తున్నాయి.

ఇనుప రాతి ఇటుకల మీద పూర్వకాలంలో పాల సముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆలయంలోని ఈశాన్యం మూలన ఉన్న గోడమీద అమితాభుడు కనిపిస్తున్నాడు. ఈ ఆలయ నిర్మాణాన్ని క్రీస్తు శకం ఆరు లేదా ఏడవ శతాబ్దంలో చేపట్టారని తెలుస్తోంది. పర్యాటకానికి ప్రస్తుత ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో మారుమూల ములుగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా పర్యాటక ప్రాంతం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఇక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు ఉండడంతో పర్యాటకులు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. పూర్తిగా ఇనుప రాతి ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించిన నేపథ్యంలో.. పర్యాటకులు సందర్శించడానికి మక్కువ చూపిస్తారని స్థానికులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper