Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు..ఎందుకంటే?

Rashi Phalalu: ఈ రాశి వారు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు..ఎందుకంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 8న శుక్రవారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహ, కర్కాటకం రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుం సభ్యుల మధ్య గొడవల కారణంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు పెరగవచ్చు. వాదనలు ఎక్కువగా చేయకుండా ఉండండి.

వృషభం:
ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు తోటి వారితో మంచిగా ప్రవర్తించండి.

మిథునం:
విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తారు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి అనుకూలం. ఉద్యోగులు ప్రణాళికలు వేస్తారు.

కర్కాటకం:
ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ. గతం నుంచి పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:
సింహ రాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే శత్రువులు మీ పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.

కన్య:
ఉద్యోగులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సోదరుడి సలహా తీసుకొని కొన్ని పనులు పూర్తి చేస్తారు.

తుల:
ఆర్థిక లావాదేవీలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో వివాదం ఉంటే సామరస్యంగా మాట్లాడాలి. లేదంటే సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.

వృశ్చికం:
విదేశాలతో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. ఆర్థిక నష్టాలు ఉండే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు.

ధనస్సు:
ఉద్యోగులు తోటివారితో సక్రమంగా ఉండాలి. లేకుంటే ఉద్యోగంపై ప్రభావం పడే అవకాశం. ఈరోజు ఎవరికి డబ్బు ఇవ్వరాదు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. సమాజంలో గౌరవం పొందుతారు.

మకర:
ప్రత్యర్థులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ వేస్తారు. ఓ సమాచారంతో సంతోషంగా గడుపుతారు.

కుంభం:
కొన్ని కార్యక్రమాల వల్ల ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి అనుకూల వాతావరణం. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం.

మీనం:
గతంలో తీసుకున్న అప్పును ఈరోజు చెల్లించవచ్చు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. కొత్త పని మొదలు పెడితే అందులో అదృష్టాన్ని పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version