Homeఆధ్యాత్మికంHoroscope Today: ఏకాదశి వేళ ఈ రాశివారికి ఈరోజు శుభఫలితాలు.. 12 రాశుల ఫలితాలు ఏ...

Horoscope Today: ఏకాదశి వేళ ఈ రాశివారికి ఈరోజు శుభఫలితాలు.. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 20న ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వృషభ రాశివారికి పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మరో రాశివారు ఓ శుభవార్తవ వింటారు. అలాగే ఏకాదశి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
కొన్నిపనుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విహార యాత్రలు చేస్తారు.

వృషభ రాశి:
వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఇతరుల నుంచి రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఇతరుల సలహాలు తీసుకోవాలి.

మిథునం:
విద్యార్థులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది.వ్యాపారులు లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేరస్తారు. కుటంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. ఈ కారణంగా ఆందోళన చెందుతారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. పాత స్నేహితులను కలుస్తారు.

సింహ:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు చేసే కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఓ సమస్యలపై ఇతరులతో చర్చిస్తారు.

కన్య:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు తప్పిదాలు లేకుడా జాగ్రత్తగా నడుచుకోవాలి. కొన్ని రంగాల వారికి ఆకస్మికంగా ఆదాయం సమకూరుతుంది.

తుల:
ఈ రాశివారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల్లో అనుకున్న విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:
కెరీర్ కు సంబంధించిన కొన్ని ప్రణాళికలు వేస్తారు. గతంలో పెండింగులో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెట్టుబడుల కోసం ఆదాయం సమకూరుతుంది.

ధనస్సు:
ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

మకర:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యక్తిగత విషయాలపై కొందరు జోక్యం చేసుకుంటారు.

కుంభం:
ముఖ్యమైన పనులు ఆలస్యం చేయొద్దు. ఏదైనా సమస్యపై తల్లిదండ్రులతో చర్చించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో దూరంగా ఉండాలి.

మీనం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో ఎక్కువగా వాదనలు చేయొద్దు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version