దేశంలో మహమ్మారి విజృంభన నేపథ్యంలో అనుకోకుండా విధించబడిన లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారు. తాజాగా వారిని తమ తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్లను వలస కూలీల కోసం వెయ్యడంతో… ఎక్కడెక్కడో ఉన్న వారంతా… తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. ఐతే… ఇలా వెళ్లేవారు… తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం… ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నోడల్ అధికారుల్ని ఏర్పాటు చేశాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు ఈ నోడల్ అధికారుల మొబైల్ నంబర్లకు కాల్ చేసి… మాట్లాడవచ్చు.