చైనాపై పలు అనుమానాలు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా (మర్చి 26 2020నాటికి) ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల 17వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా 18వేల 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సీఫుడ్ మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. ఒకవేళ సీఫుడ్ నుంచి వచ్చినట్లైతే.. చైనాలో అనేక ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కావాలి కానీ ఒక్క వుహాన్ సిటీలోనే […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 4:41 pm
Follow us on

చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా (మర్చి 26 2020నాటికి) ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల 17వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా 18వేల 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సీఫుడ్ మార్కెట్ నుంచి పుట్టిందని తొలుత చైనా వెల్లడించింది. ఒకవేళ సీఫుడ్ నుంచి వచ్చినట్లైతే.. చైనాలో అనేక ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కావాలి కానీ ఒక్క వుహాన్ సిటీలోనే రావడం పై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కి.మీ. దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోసేఫ్టీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది.ఇక్కడ ఎబోలా, నిఫా లాంటి ప్రమాదకర వైరస్‌ లపై ప్రయోగాలు చేపడతారు.ఈ ల్యాబ్ నుంచే తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) అనే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది.

 

గ్రేట్ గేమ్ ఇండియా అనే ఆన్‌ లైన్ పోర్టల్ కథనం ప్రకారం.. ఈ వైరస్ మూలాలు కెనడాలో ఉన్నాయి. ‘‘చైనాకు చెందిన ఇద్దరు బయోలాజికల్ వార్‌ ఫేర్ ప్రోగ్రాం ఏజెంట్లు ఈ వైరస్‌ ను గుట్టు చప్పుడు కాకుండా చైనాకు తీసుకెళ్లారు. ఆ కథనంలో ఇంకేముందంటే.. 2012 జూన్ 13న సౌదీకి చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఏడు రోజులపాటు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ జెడ్డాలోని ఓ ప్రయివేట్ హాస్పిట్లో చేరాడు. ఆయనకు పొగ అలవాటు లేదు, దీర్ఘకాలికంగా మందులేవీ తీసుకోవడం లేదు. దీంతో ఈజిప్షియన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మహ్మద్ జాకీ ఆ పేషెంట్ ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని అనుమానించాడు. నెదర్లాండ్స్‌ లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌‌ లో వైరాలజిస్ట్‌ గా పని చేసే రోన్ ఫౌఛిర్‌ ను సంప్రదించాడు. జాకీ పంపిన శాంపిల్‌ ను పరీక్షించిన ఫౌచిర్ ఓ శాంపిల్‌ ను కెనడాలోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబ్‌ లో పని చేసే డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్‌ కు అందజేశాడు. ఇక్కడి ల్యాబ్ నుంచి చైనా ఏజెంట్లు వైరస్‌ను తస్కరించారు. 2019 మార్చిలో అనుమానాస్పద వస్తువు ఒకటి కెనడా ల్యాబ్ నుంచి చైనాకు వెళ్లింది. విచారణలో చైనీస్ వైరాలజిస్టులు దీన్ని కెనడా ల్యాబ్ నుంచి పంపించారని తేలింది’’ అని ఆ కథనం చెబుతోంది.

అంతే కాకుండా చైనా ల్యాబ్‌ ల్లో జీవాయుధం తయారు చేస్తుండొచ్చని ఇజ్రాయెల్‌ లెఫ్టినెంట్ కల్నల్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మెడికల్ మైక్రోబయాలజీ నుంచి డాక్టరేట్ పొందారు. కెనడా నుంచి కరోనా వైరస్‌ను చైనా తస్కరించిందనడానికి, జీవాయుధాలు తయారు చేస్తోందనడానికి తగిన ఆధారాలేవీ లేవు. అదేసమయంలో దీనికి వుహాన్‌‌ లో ప్రయోగశాలే కారణమని తాను నమ్మడం లేదని ఆస్ట్రేలియా డిఫెన్స్ అనలిస్ట్ డాక్టర్ మాల్కమ్ డేవిస్ ట్వీట్ చేశారు. కానీ బయో సైన్స్‌ లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, నైతికతకు కట్టుబడి ఉండని దాని వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ నియంత్రించే విషయంలో ఆ దేశం విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈ విషయంలో నోరు మెదపకపోవడంతో అనుమనాలు మరింతగా పెరుగుతున్నాయి.