పామును కొరికి చంపిన మందుబాబు!

  అసలే 43 రోజులుగా మందు దొరక్క మందుబాబులు ఎన్ని బాధలు పడ్డారో ఆ దేవునికి, ఆ తాగుబోతుకే తెలుసు.. అలాంటిది దొరక్క దొరక్క మందు దొరికింది. ఆ ఫస్ స్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఆ మందుబాబు ఒక పాము మీద చూపించినట్టున్నాడు. పాము మనిషిని కాటేయడం సాధారణ విషయం.. కానీ మనిషే పామును కాటేస్తే..అది పెద్ద సంచలనమే అవుతుంది. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా…. కర్ణాటక బోర్డర్ లో చోటు చేసుకుంది. తన […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 2:09 pm
Follow us on

 

అసలే 43 రోజులుగా మందు దొరక్క మందుబాబులు ఎన్ని బాధలు పడ్డారో ఆ దేవునికి, ఆ తాగుబోతుకే తెలుసు.. అలాంటిది దొరక్క దొరక్క మందు దొరికింది. ఆ ఫస్ స్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక ఆ మందుబాబు ఒక పాము మీద చూపించినట్టున్నాడు. పాము మనిషిని కాటేయడం సాధారణ విషయం.. కానీ మనిషే పామును కాటేస్తే..అది పెద్ద సంచలనమే అవుతుంది. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా…. కర్ణాటక బోర్డర్ లో చోటు చేసుకుంది. తన బైక్ కు అడ్డుగా వచ్చిందన్న కోపం తో ఓ మందు బాబు ఆ పామును అందరి ముందే కొరికి, నమిలి చంపి మెడలో దండలా ముడి వేసుకుని వెళ్లాడు. దీన్ని చూసిన స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. లిక్కర్ కిక్కు తలకెక్కితే వెయ్యిఏనుగుల బలం వస్తుందంటారు. ఎంత పిరికోడికైనా కొండను ఢీకొట్టే థైర్యం వస్తుందంటారు. ఈ మాటలన్నీ నిజమో..అబద్థమో కానీ ఓ మందుబాబు ఏకంగా విషనాగునే కాటేశాడు. దాన్ని కసితీరా నోటితో కొరికి కొరికి చంపేశాడు.

చిత్తూరుజిల్లా కర్ణాటక బోర్డుర్ ములబాగుల తాలూకా ముసునూరు లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. 43 రోజుల లాక్ డౌన్ విరామం తరువాత కుమార్ అనే యువకుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడ చేరుకుని ఫుల్లుగా మందుకొట్టి అనంతరం తన బైక్ పై బయలుదేరాడు. అయితే హఠాత్తుగా ఐదు అడుగుల నాగుపాము అతని మోటారు సైకిల్ కు అడ్డంగా వచ్చింది. అంతే ఆ మందు బాబుకు పాము పై కోపం వచ్చేసింది. దానిపై దాడి చేశాడు. దానిని పట్టుకొని కొరికి చంపాడు.