spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఎంతపని చేశావ్... చంద్రన్నా..!

ఎంతపని చేశావ్… చంద్రన్నా..!

ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్న పరిస్థుతులన్నిటికి కారణం ఎవరు?” అనే ప్రశ్నకు ఒక్కసారి జవాబును వెతికినట్లైతే.. కొన్ని ఆసక్తిర విషయాలు బయటకు వస్తాయి.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఏపీకి రాజధాని లేదు. అసలు భారతదేశ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదంటే.. అతిశయోక్తి కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నది తెలంగాణ వాసులు, కానీ అన్యాయం జరిగింది మాత్రం ఏపీ ప్రజలకు..! ఎవరు అంగీకరించినా.. అంగీకరించక పోయినా.. ఇదే నిజం. రాజధానిలేని రాష్ట్రాన్ని తీసుకోవడమే ఒక తప్పైతే.. రాజధాని నిర్మించుకోవడంలో సొంత పెత్తనాలకుపోయి.. ప్రతిపక్షాల మాటలు, కమిటీల నివేదికల పట్టికుంచుకోకుండా అమరావతిలో రాజధాని నిర్మించటం చంద్రబాబు చేసిన మరో తప్పు. ఆయనేదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా “అమరావతి చంద్రబాబు మానస పుత్రిక” అని, “చంద్రబాబు సీఎం కాకపోతే ఏపీకి రాజధానే లేదన్నట్లుగా..” సొంత డబ్బాలు కొట్టుకున్నారు టీడీపీ నేతలు.

సరే.. టీడీపీ నేతలు చెప్పిందే కొద్దిసేపు నిజం అనుకుంద్దాం.. 10 ఏళ్ళు సీఎం చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు ఆయనను నమ్మి మళ్ళీ సీఎం పీఠం ఎక్కించారు. ఆ విధంగా రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ళు పాలించారు. మరి 5 ఏళ్లలో ఆయన చేసింది ఏమిటంటే.. ఏపీ రాజధానిని సింగపూరు చేస్తా.. టోటల్ గా రాష్ట్రాన్నిజపాన్ చేస్తా.. అని రంగు రంగుల డిజైన్ లతో , ఉహకందని గ్రాఫిక్స్ తో తనకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తూ… 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. దాదాపు 5600 కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు. ఇదే రాజధాని అని చెప్పి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ పెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసాడు. అసలు అంత ఖర్చుపెట్టి తాత్కాలిక భవనాలు కట్టకపోతే.. అదేపెట్టుబడితో శాశ్వత భవనం (అసెంబ్లీ లాంటి) ఒక్కటి కట్టినా.. రాజధానికి ఒక రూపు వచ్చేదిగా..అని .. అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.

అంతేకాకుండా.. ఈ మధ్య ఒక ప్రముఖ జాతీయ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం.. అమరావతి రాజధాని ప్రక్రియ ఇప్పటిదాకా కొలిక్కి రాకపోవటం జగన్ కి అనుకూలంగా మారిందని విశ్లేషించింది. అమరావతి రాజధాని గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపలే ప్రకటించి అసెంబ్లీ లో తీర్మానం చేయించగలిగినా కేంద్ర స్థాయిలో పార్లమెంటు ఆమోదం తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుంటే తిరిగి దాన్ని తిరగదోడే అవకాశం ఉండేది కాదని ఆ పత్రిక తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మూడు సంవత్సరాల్లోపు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివుండాల్సిందని కూడా తెలిపింది. హైద్రాబాదులోని వుమ్మడి ఆస్తుల విషయం ఎటూతేలకపోవటంతో పునర్విభజన చట్టం ప్రకారం హైద్రాబాదు పది సంవత్సరాలవరకు వుమ్మడి రాజధాని గా హక్కులువుండటంతో చంద్రబాబు నాయుడు సందిగ్ధంలో పడ్డట్టు అదే ఇప్పుడు తనకు గుదిబండలాగా మారిందని వ్యాఖ్యానించింది.

చివరిగా చెప్పేది ఏమిటంటే.. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులే నేడు 3 రాజధానులు చెయ్యడానికి ఇప్పటి ప్రభుత్వానికి దొరికిన అవకాశం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version