Jr NTR-Chandrababu : జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబుకు ఎందుకంత కోపం? కారణమేంటి?

ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించడం.. నారావారి పన్నాగం అంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నాయి.

Written By: NARESH, Updated On : January 8, 2024 11:35 am
Follow us on

Jr NTR-Chandrababu : ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నందమూరి కుటుంబ సభ్యులు హాట్ టాపిక్ గా ఉంటారు. వారు ఎవరి పక్షం నిలుస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమీపిస్తుండడంతో అదే ప్రశ్న వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎటు నిలుస్తారని.. వారు టిడిపికి మద్దతు తెలుపుతారా? లేదా? అన్న విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. ఇటువంటి తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎంత కఠినంగా మారిపోయారో తెలియజెప్పింది.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టిడిపి భారీ బహిరంగ సభ నిర్వహించింది.’ రా కదలిరా’ పేరుతో నిర్వహించిన సభకు చంద్రబాబుతో పాటు సీనియర్లు హాజరయ్యారు. ఇదే సభకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తారక్ ఫ్లెక్సీలతో సందడి చేశారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై టిడిపి నాయకులు,కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వద్దంటూ సూచించారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఆపై కొట్లాటకు దారితీసింది.

ఓవైపు సభ జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్, టిడిపి శ్రేణుల మధ్య గొడవ జరుగుతోంది. అయినా సరే చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతోంది. ఇదే విషయాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. ఆ కొట్లాటకు సంబంధించి వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కు జోహార్లు అర్పించడం, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించడం.. నారావారి పన్నాగం అంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నాయి.