Odi World Cup 2023: నిన్న జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఈ విషయం మీద క్రికెట్ అభిమానులు అందరు కూడా ఇండియన్ టీమ్ ని విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లను గెలిచి రికార్డును క్రియేట్ చేసింది.
ఇక అందులో భాగంగానే ఇండియా నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో 257 పరుగులు కొట్టాల్సిన క్రమంలో శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరు బాగా ఆడారు అందులో గిల్ హాఫ్ సెంచరీ చేయగా,రోహిత్ శర్మ మాత్రం 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక దాంతో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ చెలరేగి ఆడి సెంచరీ చేశాడు.
అయితే ఆయన సెంచరీ చేయడానికి కే ఎల్ రాహల్ చాలా వరకు కోహ్లీ కి హెల్ప్ చేశాడనే చెప్పాలి.అయితే ఆస్ట్రేలియా మీద జరిగిన మొదటి మ్యాచ్ లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక ఆ రోజు తన సెంచరీ మిస్ అవ్వడంతో ఇప్పుడు కోహ్లీ సెంచరీ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశ్యం తో ఆయన చాలా వరకు కోహ్లీకి సపోర్ట్ చేస్తూ ఆడడం జరిగింది.ఇక కోహ్లీ 97 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్న సమయంలో మ్యాచ్ గెలవడానికి ఇంకొక రెండు పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా ఇక అందులో భాగంగా ఈ మ్యాచ్ చూస్తున్న అభిమానులందరిలో కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అనే ఒకటే ఉత్కంఠ కలిగింది. ఇక అందులో భాగంగానే నాసుమ్ అహ్మద్ వేసిన 41 ఓవర్ మూడోవ బాల్ ని కోహ్లీ సిక్స్ కొట్టడం తో కోహ్లీ వన్డేల్లో తన 48 వ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.
అలాగే వరల్డ్ కప్ లో మూడోవ సెంచరీ ని నమోదు చేసుకున్నాడు… ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు కోహ్లీ సెంచరీ మీద సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ అనేవి వైరల్ అవుతున్నాయి…ఇక వీటిని చూసిన అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి… ఇక ఇండియా సాధించిన ఈ నాలుగు విజయాలతో పాటు గా ఇంకా రాబోయే మ్యాచ్ లో మంచి విజయాలు సాధిస్తేనే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ కొడుతుంది. అలాకాదని మనం అన్ని మ్యాచ్ లు గెలుస్తున్నాం.కాదని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా జరిగే నష్టాలకు ఇండియన్ టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది…