Team India : వన్డే వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ప్రకటన.. అతడు ఔట్.. సీనియర్ ఇన్

తన వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేస్తూ కొత్త స్క్వాడ్ ను ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనుంది.

Written By: NARESH, Updated On : September 28, 2023 9:36 pm

Team India New Jersey

Follow us on

Team India : అసలు సోదిలోనే లేని ఆటగాడు ఇప్పుడు ఏకంగా వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించాడు. ఇన్నాళ్లు వన్డే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకొని ఉన్న అక్షర్ పటేల్ ఏకంగా గల్లంతయ్యాడు. వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫైనల్ జట్టు ప్రకటించారు. ఇందులో అనూహ్యమైన నిర్ణయం చోటు చేసుకుంది. తన వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేస్తూ కొత్త స్క్వాడ్ ను ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనుంది.

వన్డే వరల్డ్ కప్ లో ఇన్నిరోజులు ఆల్ రౌండర్ గా ఉన్న అక్షర్ పటేల్ ను ఎంపిక చేయలేదు. శ్రీలంక ఆసియా కప్ లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ను టీమిండియాలోకి తీసుకున్నారు. ఇదొక్క మార్పు మినహా భారత్ తన స్క్వాడ్ ను యథాతథంగానే ప్రకటించడం విశేషం.

నిజానికి అక్షర్ పటేల్ ఫిట్ గా ఉంటే అతడినే వన్డే వరల్డ్ కప్ కోసం తీసుకునే వారు. ఎందుకంటే అక్షర్ సూపర్ బ్యాటర్ తోపాటు ఎడమచేతి వాటం స్పిన్నర్. కానీ ఆసియాకప్ లో గాయపడిన అక్షర్ నిన్నటి ఆస్ట్రేలియా మూడో వన్డే వరకూ ఫిట్ నెస్ సాధిస్తే జట్టులోకి వచ్చి ఆడేవాడే. కానీ గాయం తగ్గకపోవడంతో ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో ఇటీవల ఆస్ట్రేలియాపై రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన కనబరిచిన రవిచంద్రన్ అశ్విన్ కు జట్టులో చోటు కల్పించారు. అశ్విన్ రాకతో స్పిన్నింగ్ ఆప్షన్ లో భారత్ మరింత బలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, రవీంద్రజడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, బుమ్ర, షమీ, సిరాజ్