Sindhis Protest : పాకిస్తాన్ లో కొత్త దేశం కోసం ‘సింధూ’ల తిరుగుబాటు

పంజాబీలు, సింధూయేతరులు అంతా కూడా తమ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని వీరి డిమాండ్ గా ఉంది. బెలూచీలతో కలిసి సింధీలు కూడా పాక్ పై తిరుగుబాటుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By: NARESH, Updated On : August 24, 2023 4:41 pm

Sindhis Protest : పాకిస్తాన్ లో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. ఒకవైపు బెలూచీలు స్వాతంత్ర్య పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. గెరిల్లా దాడులు చేస్తున్నారు. చైనా వాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోతున్నారు. ఫస్తూన్ లో పాకిస్తాన్ తాళిబాన్ లు కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పడుతున్నారు.

గ్రీన్ లాండ్ అయినటువంటి సింధ్ లు ఉద్యమ బాట పట్టారు. సింధూ దేశం కోసం వారు పోరాటం మొదలుపెట్టారు. ‘జై సింధూ ఫ్రీడం మూమెంట్ కింద ర్యాలీ’ అవుతున్నారు.

పాకిస్తాన్ లో కశ్మీర్ ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. హిజ్బుల్ ముజాహిదిన్ తీవ్రవాదిని రావల్పిండి మిలటరీ ఆఫీస్ ముందే చంపేశారు. వారం తిరగకముందే సయ్యద్ ఖలీద్ రాజాను కూడా ఇంటిముందే పాయింట్ బ్లాంక్ లో చంపేశారు. ‘ఆల్ బదర్ కశ్మీర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ’గా కొనసాగారు. సింధూ దేశ్ రివెల్యూషన్ ఆర్మీ అతడిని చంపినట్టు తెలిపారు.

సింధూ దేశ్ రివెల్యూషన్ ఆర్మీ ఏంటని ఆరాతీస్తే.. బెలూచీ స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు సింధూలు కూడా స్వాతంత్ర్య పోరాటం మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ కలిసి పోరాడుతున్నట్టు సమాచారం.

పంజాబీలు, సింధూయేతరులు అంతా కూడా తమ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని వీరి డిమాండ్ గా ఉంది. బెలూచీలతో కలిసి సింధీలు కూడా పాక్ పై తిరుగుబాటుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.