Pakistan : మతం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది?

దీనికి కూడా భారత్ ను బ్లేమ్ చేస్తారా? మీకు మీరే చంపుకుంటారా.. మిలాద్ ఉన్ నబీ మహ్మద్ ప్రవక్త పుట్టినరోజున ఈ దాడులు జరగడం దారుణం.

Written By: NARESH, Updated On : September 30, 2023 4:17 pm

Pakistan : పాకిస్తాన్ లో నిన్న మారణహోమం జరిగింది. రెండు ఆత్మాహుతి దాడుల్లో 55 మంది పౌరులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఒకటి బెలూచిస్తాన్.. రెండోది ఖైబర్ ఫక్తూన్ లలో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు అంతా రక్తసిక్తమవుతోంది. పాకిస్తాన్ పాలన అక్కడ లేదని అనిపిస్తోంది.

ఇందులో ఎవరు ఎవరిని చంపుకుంటున్నారు. దీనికి కూడా భారత్ ను బ్లేమ్ చేస్తారా? మీకు మీరే చంపుకుంటారా.. మిలాద్ ఉన్ నబీ మహ్మద్ ప్రవక్త పుట్టినరోజున ఈ దాడులు జరగడం దారుణం. దీనికి కారకులు ఎవరు..? మతం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు తగిన శాస్తి అనుభవిస్తోంది పాకిస్తాన్.

లష్కర్ ఏ తోయిబా అధినేత హఫీజ్ సయీద్ కొడుకును కిడ్నాప్ చేయగా.. ఈరోజు శవమై తేలింది. దీన్ని పాకిస్తాన్ దాచేసింది. ఎక్కువమందిని పిలవకుండా పాకిస్తాన్ ఆర్మీ రహస్యంగా ఖననం చేశారు. ఇక్కడ కశ్మీర్ లో ఉగ్రవాదులు చనిపోతున్నారు. కశ్మీర్ గురించి మాట్లాడే లష్కర్ అధినేత కొడుకే శవమై తేలాడు.

మతం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే ఇంతకన్నా ఏం జరుగుతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.