Homeఆంధ్రప్రదేశ్‌MP MVV Satyanarayana: విజయసాయిరెడ్డి భూదందా, కొత్త పార్టీపై సొంత పార్టీ ఎంపీ సంచలన ఆరోపణలు

MP MVV Satyanarayana: విజయసాయిరెడ్డి భూదందా, కొత్త పార్టీపై సొంత పార్టీ ఎంపీ సంచలన ఆరోపణలు

MP MVV Satyanarayana: వైసీపీ అగ్రనేత, వైఎస్ జగన్ అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డిని సొంత పార్టీకే చెందిన విశాఖ ఎంపి ఎం.వి.వి.సత్యనారాయణ ఏకి పారేశారు.ఈ మేరకు ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమేనా? ఆయన వ్యాఖ్యలు చేశారా? అన్నది మాత్రం అధికారికంగా తెలియడం లేదు. ఆ జాతీయ మీడియా కథనాలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

విశాఖలో అక్రమాలు, భు దందాలను విజయ సాయి రెడ్డి తన కుటుంబ సభ్యులు చేస్తున్నారనీ, విజయ సాయి రెడ్డి పెద్ద అవినీతిపరుడనీ, అక్రమార్కుడనీ, విశాఖలో ఆయన పెత్తనం ఏంటని, పి.ఎం కార్యాలయం ఏం చేస్తుందని విశాఖ ఎంపి ఎం.వి.వి.సత్యనారాయణ ఆ ఇంటర్వ్యూలో ఘాటుగా హెచ్చరించినట్టు సమాచారం.

తాను పత్రికను ప్రారంభిస్తానని, టీవీ న్యూస్ ఛానల్ పెడతానని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దిగుతానని అన్నారని, పార్టీ పెట్టడం ఒకటే ఆలస్యం అని ఎం.వి.వి సత్యనారాయణ విమర్శించారు. తాను ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తిననీ ఎవడికి తల వంచాల్సిన పని లేదని వెల్లడించారు,.

విశాఖపట్నంలో తన ల్యాండ్ డీల్స్ గురించి ‘ఈనాడు’కి లీక్ చేయడం వెనుక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హస్తం ఉందని విజయ సాయిరెడ్డి అనుమానిస్తున్నట్టు సమాచారం. కూర్మన్నపాలెంలో హౌసింగ్‌ ప్రాజెక్టులో ఎంపీ 99 శాతం వాటా తీసుకోవడంపై విశాఖ ఎంపీ బహిరంగంగా మీడియాతో మాట్లాడడం దుమారం రేపింది. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి చెందిన అనుమానాస్పద భూముల లావాదేవీలపై ఎంవీవీ సత్యనారాయణ బహిరంగ ఆరోపణలు చేస్తూ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారని అంటున్నారు. “విజయసాయి తనలోని మురికిని ముందుగా కడిగి, ఆ తర్వాత ఇతరులను నిందించనివ్వండి. విజయసాయిరెడ్డి కూతురు విశాఖపట్నం చుట్టుపక్కల ఆస్తులు ఎడమ, కుడి, మధ్యలో కొనుగోళ్లతో రెచ్చిపోతున్నారు. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు మించి విశాఖలో భూదందా చేస్తున్నారు’’ అని ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో సొంత పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శించారు. తనతో మళ్లీ ఎదురుపడితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగుతానని విజయసాయిరెడ్డి బెదిరించడాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇద్దరు ఎంపీలు మీడియాలో తమ మురికిని ఉతికి ఆరేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో మూగ ప్రేక్షకుడిలా మారిపోవడం గమనార్హం.

విజయ్ సాయి రెడ్డిపై ఎంపి ఎం.వి.వి. గారి వ్యాఖ్యలతో వైసీపీలో తీవ్ర అలజడి మొదలైంది. భవిష్యత్తులో తీవ్ర ప్రకంపనలు ఖాయమని అనిపిస్తుంది, కచ్చితంగా పార్టీలో అంతర్గతంగా తీవ్ర స్థాయిలో కుమ్ములాటలు ఉన్నాయన్న విషయం తేటతెల్లమైంది…దీనిపై జగన్ ఎలా స్పందిస్తాడు? ఈ విషయంలో విజయసాయిరెడ్డిని వెనకేసుకొస్తాడా? విశాఖ ఎంపీకి అండగా నిలుస్తాడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular