Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత రికార్డులు తిరగరాస్తు ఊహించని సీట్లు గెలుపొందింది. రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. సిద్ధరామయ్య లేదా శివకుమార్ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చు.. ఇది ఇప్పటివరకు సాగిన చర్చ. నిన్న కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే సోషల్ మీడియా హోరెత్తిపోయింది.. ఇన్నాళ్లు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. విజయం ఎప్పుడైనా ఒక భరోసా ఇస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు ఎంపీ స్థానాలతో మొదలుపెట్టి ఈరోజు రెండవసారి దేశాన్ని పాలిస్తున్న బిజెపి కావచ్చు. కానీ ఇక్కడ గర్వం తలకు ఎక్కితేనే అసలు ప్రమాదం.. నిన్న కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంత పట్టణం భట్కల్ చౌక్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది.. వాస్తవానికి అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్య. వైద్య గెలిచాడు కాబట్టి అక్కడ ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా. యాదృచ్ఛికంగా కాంగ్రెస్ జెండాకు బదులు పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదం కూడా హోరెత్తింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కాంగ్రెస్ నేతలపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ” కాంగ్రెస్ పార్టీ జెండాకు బదులు పాకిస్తాన్ జెండాను ఎగరవేసేందుకైనా మీకు అధికారం ఇచ్చింది” అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో కర్ణాటక రాష్ట్రంలో కేరళ ఫైల్స్ వరుస వెంట జరుగుతాయని జోస్యం చెబుతున్నారు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://oktelugu.com//wp-content/uploads/2023/05/VID-20230514-WA0003.mp4?_=1Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mim leaders celebrate congress victory in karnataka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com