Kurchi Thatha : పాపం.. కుర్చీ తాత.. వరంగల్ బస్టాండ్ లో భిక్షాటన.. వైరల్ వీడియో

ఒక బీరు తాగి ఉన్న కుర్చీ తాత పక్కనే ఉన్న ఇనుప కుర్చీ మడతపెట్టి కొడితే బామ్మర్ది మెడలు విరిగిపోయాయంట. షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఈ డైలాగ్ పిచ్చ వైరల్ అయ్యింది.

Written By: NARESH, Updated On : January 8, 2024 4:05 pm
Follow us on

Kurchi Thatha : కుర్చీ తాతగా ఫేమస్ అయిన షేక్ అహ్మద్ పాషా బిచ్చగాడిగా మారాడు. వరంగల్ బస్ స్టాండ్ లో ఆడుకుంటున్న కుర్చీ తాత వీడియో వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో షేక్ అహ్మద్ పాషా నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకులు పట్టించుకోకపోవడంతో భార్య కూతురు దగ్గర ఉంటుంది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఖాళీగా ఉండే షేక్ అహ్మద్ పాషా కుర్చీ తాతగా ఫేమస్ అయ్యాడు. ఒకరోజు ఆయన తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొట్టినట్లు చెప్పాడు.

ఆ చెప్పిన విధానం మాస్ హీరో డైలాగ్ రేంజ్ లో ఉంది. పుట్టింటికి వెళ్లిన భార్యను తెచ్చుకునేందుకు అత్తారింటికి వెళ్లిన షేక్ అహ్మద్ పాషా పైకి బామ్మర్ది గొడ్డలి పట్టుకు వచ్చాడట. ఒక బీరు తాగి ఉన్న కుర్చీ తాత పక్కనే ఉన్న ఇనుప కుర్చీ మడతపెట్టి కొడితే బామ్మర్ది మెడలు విరిగిపోయాయంట. షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఈ డైలాగ్ పిచ్చ వైరల్ అయ్యింది.

దాంతో షేక్ అహ్మద్ పాషా కాస్తా… కుర్చీ తాతగా ఫేమస్ అయ్యాడు. కుర్చీ తాతకు సంపాదన లేదు. అందుకే పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో కుర్చీ తాత డైలాగ్ పాటలో పెట్టారు. విడుదల చేసిన మూడో సాంగ్ లో ‘కుర్చీ మడత పెట్టి’ అని తాత డైలాగ్ నేరుగా వాడేశారు. దీంతో కుర్చీ తాత మరింతగా జనాల్లోకి వెళ్ళాడు.

గుంటూరు కారం మూవీ సాంగ్ లో కుర్చీ తాత డైలాగ్ వాడినందుకు లక్ష రూపాయల వరకు డబ్బులు ఇచ్చారని ప్రచారం జరిగింది. రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. కుర్చీ తాత బిచ్చగాడిగా మారాడు. మొన్నామధ్య ఆర్టీసీ బస్సులు రూపాయి ఉంటే ఇవ్వండని ఆడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. తాజాగా వరంగల్ బస్ స్టేషన్ లో ఒక మూలన కూర్చుని కుర్చీ తాత ఆడుకుంటున్నాడు. ఇంత పెద్ద సోషల్ మీడియా సెలబ్రిటీ అడుక్కోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని జనాలు వాపోతున్నారు.