Rahul Gandhi : G-20 సమావేశాల ముందు అంతర్జాతీయ కుట్రలో పావుగా రాహుల్ గాంధీ

ఇండియా కూటమి ఎక్కడా కూడా మోడీ-అదానీ గురించి ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. జీ20 సమావేశాల లోపల మోడీ-అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేయడం విశేషం.

Written By: NARESH, Updated On : September 2, 2023 4:32 pm

Rahul Gandhi : రాహుల్ గాంధీ ఇండియా కూటమి సమావేశాన్ని హైజాక్ చేసినట్టుగా కనిపిస్తోంది. పోస్టర్లు, రాహుల్ ను ముందు పెట్టి మిగతా నేతలను దూరంగా పెట్టడం.. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసిన తీరు చూస్తే ఇంతకుముందు రెండు సమావేశాల్లో జరుగనిది.. ఈ సమావేశంలో భిన్నమైనది జరిగింది ఏంటంటే..
ఈ సమావేశాలు రెండు రోజులు జరుగుతుంటే మొదటి రోజు రాహుల్ గాంధీ విడిగా విలేకరుల సమావేశం పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇండియా కూటమి గురించి మాట్లాడలేదు. అదానీ, మోడీ గురించి విమర్శిస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇండియా కూటమి ఇప్పటివరకూ దీని మీద సరిగ్గా స్పందించలేదు.

ఇండియా కూటమి ఎక్కడా కూడా మోడీ-అదానీ గురించి ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. జీ20 సమావేశాల లోపల మోడీ-అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేయడం విశేషం.

జీ20 సమావేశాలతో భారత్ ప్రతిష్ట పెంచుతున్న ఈ సమయంలో ఈ డిమాండ్ చేయడం అంటే భారత్ వ్యతిరేకులు మాత్రమే ఇలాంటి డిమాండ్ చేస్తారు. రాహుల్ గాంధీ కూడా భారత్ వ్యతిరేకంగానే ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు.

G-20 సమావేశాల ముందు అంతర్జాతీయ కుట్రలో పావుగా మారిన రాహుల్ గాంధీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.