Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం పై నిరసన వ్యక్తం చేస్తూ, ప్రముఖ సోషలిస్టు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష గత 20 రోజుల నుండి జరుగుతోంది. అయితే రీసెంట్ గానే ఢిల్లీ లో వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవ్వడం తో కాక్రోజ్ జనతా పార్టీ ఆద్వర్యం లో పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున ధర్నాలు , రాస్తా రోకోలు జరుగుతున్నాయి. స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం, వాళ్లకు తీవ్రమైన గాయాలు అవ్వడం వంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
వీళ్ళ డిమాండ్ అంతా ఒక్కటే , కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ కి బాధ్యత వహిస్తూ , పదవికి రాజీనామా చేయడమే. కానీ ఇప్పటి వరకు రాజీనామా చేయకపోవడం వల్లే ఇంత పెద్ద రచ్చ జరుగుతోంది. అంతే కాకుండా ఈ నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. పార్లమెంట్ బయట నిరసనకారులతో కలిసి రాహుల్ గాంధీ కూర్చోవడం తో , ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన్ని అదుపులోకి తీసుకునే క్రమం లో చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే రాహుల్ గాంధీ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఆయన వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ గారితో పాటు , ఇతర ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం అప్రజాస్వామికం. ప్రతిపక్ష పార్టీల మద్దతుకు మా TVK పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. నీట్ పరీక్ష విద్యార్థులను , వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నీట్ ని తక్షణమే రద్దు చెయ్యాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తప్పుడు హామీలు ఇవ్వకూడదు’ అంటూ ఆయన విమర్శించారు. దీంతో సోనమ్ చేపడుతున్న నిరాహార దీక్షకు విజయ్ మద్దతు కూడా తోడైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పార్టీలు ఒకే తాటి పైకి రాబోతున్నాయో చూడాలి.

