Homeజాతీయ వార్తలుCorporate tax: కార్పొరేట్ కంపెనీల లాభాలపై పడ్డ మోడీ సర్కార్?

Corporate tax: కార్పొరేట్ కంపెనీల లాభాలపై పడ్డ మోడీ సర్కార్?

Corporate tax : అంతర్జాతీయ సంస్థలపై కార్పొరేట్ పన్ను విధించాలన్న ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. ఇటీవల ఈ ఒప్పందానికి అంగీకారం తెలుపుతున్నట్లు ప్రకటించింది. పన్ను’ పీకడంలో ఆరితేరిన మోడీ సర్కార్ ఈ కార్పొరేట్ కంపెనీల పన్ను విషయంలో వెంటనే ఓకే చెప్పేసింది. ఇకపై అంతర్జాతీయ కంపెనీల లాభాల్లో 15 శాతం పన్నును ఆయా దేశాల ప్రభుత్వాలు విధిస్తాయన్నమాట. ఈ ఒప్పందానికి శ్రీలంక, పాకిస్తాన్, నైజిరియా దేశాలు దూరంగా ఉన్నాయి. ఆ దేశాలు దీనిని అంగీకరించలేదు. అయితే ఇలా అంతర్జాతీయ సంస్థపై పన్నును ఎందుకు విధిస్తున్నారు..? దీనిపై భారత్ ఎందుకు అంగీకారం తెలిపింది..? అసలు కారణాలేంటనే దానిపై స్పెషల్ ఫోకస్..

Modi-times-now-summit-income-tax-clarify
Modi-times-now-summit-income-tax-clarify

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ నిర్వహించిన సమావేశంలో కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు 15 శాతం పన్ను విధించాలని అమెరికా ప్రతిపాదించింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, బహుళ జాతి సంస్థలు పన్ను ఎగ్గొట్టకుండా ఉండడానికి ఈ ప్రతిపాదనను చేసింది. దీనికి భారత్ సహా 136 దేశాలు అంగీకారం తెలిపాయి. రోమ్ నగరంలో అక్టోబర్ చివరి వారంలో జరిగిన జీ 20 సదస్సులో ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్తిక వ్యవస్థల అధినేతలు దీనికి ఆమోదం తెలిపారు. 2023 నుంచి ఇది అమల్లోకి రానుంది. సాధారణంగా బహుళ జాతి కంపెనీలు ఏ దేశంలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని అక్కడ లాభాలు ప్రకటిస్తాయో ఆయా దేశాలు పన్నును విధిస్తాయి. అయితే ఆ సంస్థ ఇతర దేశాల్లో సంస్థలు ఏర్పాటు చేస్తే అనుబంధ సంస్థగా పరిగణించి అక్కడి లాభాలను అనుబంధ సంస్థకు తరలిస్తున్నారు. దీంతో మొదటి దేశం ఆదాయాన్ని కోల్పోతోంది.

కంపెనీలు ఇలా చేయడంతో ప్రభుత్వాలు కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో పడ్డాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ , ఫేస్ బుక్ లాంటి దిగ్గజాల నుంచి పన్ను రాబట్టేందుకు ఈ ప్రతిపాదనను చేసినట్లు తెలుస్తోంది. తాజాగా చేసిన చట్టం ప్రకారం.. ఎక్కడైతే లాభాలు ప్రకటిస్తారో అక్కడే పన్నులు విధించాల్సి ఉంటుంది. ప్రధాన కార్యాలయాలు, పేటెంట్ హక్కులతో పనిలేకుండా విక్రయాలు జరిగిన చోటే పన్ను చెల్లించాలి. కంపెనీ లాభాలపై పన్ను స్వర్గాలుగా పిలిచే కొన్ని దేశాల్లో పన్ను విధించకపోయినా, తక్కువగా విధించినా ఆ లాభాలపై స్వదేశం ‘టాప్ ఆప్ ట్యాక్స్’ విధించవచ్చు. అలా సంస్థపై మొత్తంగా 15 శాతం పన్ను విధిస్తారు.

భారత్ లో ఇంటర్నెట్ ఆధారంగా చేసే వ్యాపార సంస్థలపై కేంద్రం 6 శాతం డిజిటల్ పన్ను విధిస్తోంది. 2016లో దీనిని ప్రవేశపెట్టింది. భారత్లో ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలపై దీనిని విధిస్తారు. అంటే టెక్ కంపెనీల వార్షిక ఆదాయం రూ.2 కోట్లు దాటితే ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. గూగుల్, అమెజాన్, ఫేసు బుఖ్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే తాజాగా ప్రవేశపెట్టిన కార్పొరేట్ పన్ను అమల్లోకి వస్తే డిజిటల్ పన్ను రద్దు చేయాల్సి ఉంటుంది. 2019లో భారత్ కార్పొరేట్ పన్నును తగ్గించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించింది. రాయితీలు, ప్రోత్సాహకాలు వద్దనుకునే దేశీయ కంపెనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2019 అక్టోబర్ 1 నుంచి ఉత్పత్తి రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ సంస్థలు రాయితీలు తీసుకోకుంటే 15 శాతం పన్ను విధిస్తారు.

గ్లోబల్ పన్నులు భారత్ కు మేలే చేస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్ నర్ కన్నల్టింగ్ సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. అయితే కార్పొరేట్ పన్ను కనీస పరిమితి 15 శాతం నిర్దేశించడాన్ని చారిటీ సంస్థ ఆక్స్ ఫామ్ విమర్శించింది. ఇది చాలా తక్కువ అని, దీని వల్ల ఏమీ ఉపయోగం ఉండదని తెలిపింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper