India Iran Diplomatic Success: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వార్ ముదురుతోంది. 17 రోజులుగా ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఇరాన్ హార్మూజ్ జలసంధిపై పట్టు బిగింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భాగా నౌకలు ఆగిపోయాయి. చమురు, సరుకు రవాణా స్తంభించింది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించాయి. భారత నౌకలు హర్మూజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత జెండాతో వెళ్లే నౌకలను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో శివాలిక్, నందాదేవి నౌకలు జలసంధిటి సురక్షితంగా భారత తీరానికి చేయాయి.
భౌగోళికంగా కీలక జలసంధి..
33 కి.మీ. వెడల్పు గల హర్మూజ్ జలసంధి భౌగోళికంగా కాలకమైనది. ఈ సన్నని మార్గం పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్తో అనుసంధానిస్తుంది. పొడవు 167 కి.మీ., ఇరాన్ ఉత్తరం, ఒమన్–యూఏఈ దక్షిణం. ప్రపంచ చమురు 20–25 శాతం, ఎల్పీజీ 30 శాతం దీనిగుండా రవాణా అవుతుంది. ûదీ, ఇరాక్, ఖతార్, కువైట్ ఎగుమతులకు ఏకైక గేట్వే. అమెరికా–ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ జలసంధిని మూసేసింది. 700లకుపైగా నౌకలు చిక్కుకున్నాయి. చమురు ధరలు టన్ను 100 డాలర్లకు చేరాయి.
భారత చర్చలు సఫలం..
ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపటిది. ఇరాన్తో సంప్రదింపులు జరిపింది. జైశంకర్ జరిపిన చర్యలు ఫలించాయి. దీంతో ఇరాన్ భారత ఓడలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. చైనాకు కూడా రవాణా జరుగుతోంది. దీంతో భారత నౌకలు శివాలిక్ (ఫ్రిగేట్), నందాదేవి (కోర్వెట్) రక్షణలో చమురు కంటైనర్లు దాటాయి. భారత్కు 2 మిలియన్ బ్యారెళ్లు చేరుకుంది.
పక్షం రోజులుగా ఇంధన సరఫరా నిలిచిపోయినా భారత్ పెట్రోల్ ధరలు ఫెంచలేదు. పెద్దగా ఇబ్బంది కూడా కలుగడం లేదు. గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఎల్పీజీ ధరలను కేంద్రం పెంచింది. మరోవైపు ఎల్పీసీ కొరత తీర్చేందుకు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. భారత జెండా ఉన్న నౌకలను అనుమతించాలని నిర్ణయించింది.