Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ పై గౌతమ్ ఫ్యాన్స్ ఆగ్రహం… కారణం ఇదే!

బిగ్ బాస్ దత్త పుత్రిక శోభ, ముద్దు బిడ్డ రతిక లను కాపాడుకునేందుకు చాలా మందిని బలి చేశారు. ఈ వారం గౌతమ్ వంతు వచ్చింది. ఇక గౌతమ్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అర్జున్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. కాబట్టి అర్జున్, శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక లు టాప్ లో ఉండే అవకాశం ఉంది.

Written By: NARESH, Updated On : December 4, 2023 3:43 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ షోలో గౌతమ్ జర్నీ ముగిసింది. 13వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. శోభ-గౌతమ్ డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. గౌతమ్ ఎలిమినేషన్ పై నెటిజన్స్ గుర్రుగా ఉన్నారు. బిగ్ బాస్ నిర్వాహకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతి సారి ఈ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఏంటి బిగ్ బాసూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఓటింగ్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు.

ఈ వారం అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే గౌతమ్ కి ఓటింగ్ బానే వచ్చినా ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గా అనిపిస్తుంది. యావర్, శోభా శెట్టి, గౌతమ్, ప్రియాంక డేంజర్ జోన్ లో ఉన్నారు. లెక్క ప్రకారం అయితే శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాలి కానీ .. శోభ ని సేవ్ చేసి గౌతమ్ ని బలి చేసాడు బిగ్ బాస్. దీంతో ఇది అన్ ఫెయిర్ .. గౌతమ్ కి చాలా అన్యాయం జరిగిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

బిగ్ బాస్ నీకు నచ్చిన వారిని ఎలిమినెట్ చేసుకోవడానికి ఓటింగ్ ఎందుకు అంటూ మండి పడుతున్నారు. ప్రతి వారం పోలింగ్ పెట్టడం దేనికి .. చివరికి నీకు నచ్చిన వ్యక్తిని సేవ్ చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని వారాలుగా ఇదే జరుగుతుందని కొందరి అభిప్రాయం. మొదటి నుండి కొందరి పట్ల యాజమాన్యం పక్షపాత వైఖరి కలిగి ఉందని అంటున్నారు.

బిగ్ బాస్ దత్త పుత్రిక శోభ, ముద్దు బిడ్డ రతిక లను కాపాడుకునేందుకు చాలా మందిని బలి చేశారు. ఈ వారం గౌతమ్ వంతు వచ్చింది. ఇక గౌతమ్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అర్జున్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. కాబట్టి అర్జున్, శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక లు టాప్ లో ఉండే అవకాశం ఉంది.