Hyderabad : శాంతిభద్రతల్లో దేశంలో అంత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్కు గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు అది అబద్ధమనేలా పరిస్థితులు మారుతున్నాయి. జంట నగరాల్లో 15 గంటల్లోనే ఐదు ప్రాంతాల్లో హత్యలు జరిగాయి. గంటల వ్యవధిలో జరిగిన హత్యలు భాగ్యనగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నగరానికి ఏమైంది.. మనుషులు ఎందుకిలా వ్యవమరిస్తున్నారు.. క్రూరంగా ఎందుకు మారుతున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షలాది సీసీ కెమెరాలు ఉన్నా నిందితులు భయం లేకుండా వ్యవహరిస్తుండడం గమనార్హం.
-15 గంటలు.. ఐదు హత్యలు..
శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న తెలంగాణలో బుధవారం 15 గంటల వ్యవధిలో ఐదు హత్యలు జరిగాయి. దుండగులు రాత్రే కాదు పట్టపగలు సైతం హత్యలు చేస్తున్నారు. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి.
– అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లను ు గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు హత్యలు జరిగాయి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరినీ రాళ్లతో కొట్టి చంపారు.
– చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకరిని హత్య చేశారు. అజంపురాలో గుర్తుతెలియని వ్యక్తిని హతమార్చారు.
– నార్సింగ్లో తనను ప్రేమించలేదని యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా.. నిందితుడు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ గుంటూరు జిల్లాలో ఒకే ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.
– చాదర్ఘాట్లో ఓ యువకుడిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. యువకుడిని వెంబడించిన ఓ వ్యక్తి.. అతడిని కత్తితో వెనుక నుంచి పొడిచి పారిపోయాడు. బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి బైక్పై తన భార్యను చూసి కోపోద్రిక్తుడైన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.