Shahrukh Khan : షారుఖ్ ఖాన్ తిరుమల అందుకే వెళ్లారా?

ఈ టాక్ ను రూపుమాపేలా, అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకునేలా షారుఖ్ ఖాన్ తిరుమల టూర్ కు వచ్చారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : September 8, 2023 1:39 pm
Follow us on

Shahrukh Khan : షారుఖ్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ సినిమా జవాన్ ఈ రోజు విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన జవాన్ ప్రేక్షకులను కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అయితే జవాన్ సినిమా విడుదలకు ముందే షారుఖ్ ఖాన్ తిరుమల వెళ్లారు. పంచె, తెల్ల షర్టు వేసుకొని హిందూ సాంప్రదాయ పద్దతిలో శ్రీవారిని దర్శనం చేసుకొని స్వామి వారి ఆశీర్వాదం కూడా అందుకున్నారు షారుఖ్ ఖాన్.

ఓ పాట ద్వారా చెలరేగిన దుమారం వల్ల జవాన్ సినిమాకు అనుకోని విధంగా నెగటివిటీ వచ్చింది. అంతేకాదు సినిమాను బహిష్కరించాలి అని కూడా పిలుపునిచ్చారు. ఈ టాక్ ను రూపుమాపేలా, అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకునేలా షారుఖ్ ఖాన్ తిరుమల టూర్ కు వచ్చారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా.. టాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్లు రావాలని ఈ టూర్ వేశారంటూ ప్రచారం జరుగుతుంది.

చిత్ర యూనిట్ బహిష్కరణ ధోరణిని ఎదుర్కొని నానా తంటాలు పడింది. అందుకే సినిమా సాఫీగా సాగాలని షారుఖ్ ఖాన్ తిరుమలకు పంచె, ధోతి కట్టుకొని సాంప్రదాయ బద్దంగా వెళ్లారని కొందరి వాదన. అయితే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటన దీనికి కారణం అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న ప్రకటనలు సంచలనం రేపుతున్నాయి.

సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగీ వ్యాధులతో పోల్చారు మంత్రి. అంతేకాదు సనాతన ధర్మాన్ని రూపుమాపాలని కూడా మండిపడ్డారు. అసలు ఈ మంత్రికి, జవాన్ సినిమాకు సంబంధం ఏంటి అని కొందరి అనుమానం.

షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ కు మంత్రి స్టాలిన్ కు సంబంధం ఉందని తేలడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమా తమిళనాడు పంపిణీ హక్కులను ఇప్పటికే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సొంతం చేసుకున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా జవాన్ తమిళ వెర్షన్ తమిళనాడుతో పాటు బెంగళూరులో పంపిణీ చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే సనాతన ధర్మం గురించి ప్రకటన చేసిన తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ మీద బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు నిప్పులు చెరిగారు. ఇలా నెగటివిటీని మూట గట్టుకున్న స్టాలిన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడంతో షారుఖ్ అభిమానుల్లో టెన్షన్ కూడా మొదలైంది.

ఇక కలెక్షన్ల పరంగా మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల కలెక్షన్లు సాదిస్తే.. కేవలం హిందీలోనే రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అంటే బాలీవుడ్ లోనే బాద్ షా హవా నడుస్తుంది. ప్రతి ఇండస్ట్రీలో కూడా బాలీవుడ్ రేంజ్ లో కలెక్షేన్లు రావాలంటే ఆ తరహా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండాల్సిందే. ఇటు నయనతార, విజయ్ సేతుపతి వల్ల టాలీవుడ్, కోలీవుడ్ లో కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఈ స్టార్లతో పాటు దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ ల క్రేజ్ కూడా కలవడంతో టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఈ సినిమా రేంజ్ పెరుగుతుంది. కాబట్టి మరోసారి షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తారు అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.